Posts

Showing posts from April 5, 2020

మీవోళ్లు మాకొద్దు.. తీసుకుపోండి !

Image
కోవిడ్‌-19 వైరస్‌ విజృంభణతో తల్లడిల్లిపోతున్న అమెరికా, ఆ దేశంలోని ఇతర దేశ పౌరుల విషయంలో కఠినవైఖరి అనుసరిస్తున్నది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న విదేశీ పౌరులను వెంటనే ఆయాదేశాలు తీసుకెళ్లాలని లేదంటే ఆయా దేశాలపై వీసా ఆంక్షలు విధిస్తామని అధ్యక్ష భవనం హెచ్చరించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు వైట్‌హౌస్‌ ఆదేశాలిచ్చింది. తమ పౌరులు, జాతీయులను సొంత ప్రాంతాలకు తరలించటంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న లేదా తీసుకెళ్లటానికి నిరాకరిస్తున్న దేశాలు ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నాయని భావించాల్సి ఉంటుంది. అమెరికా చట్టాలను అతిక్రమించి ఇక్కడ ఉంటున్న విదేశీయులను కచ్చితంగా వారి దేశాలకు తీసుకెళ్లాల్సిందే అని ఆదేశాల్లో పేర్కొన్నారు. ---------------------------------------------------------------------------------------- The United States, which is struggling with the Kovid-19 virus boom, is following a tough line towards citizens of other countries. The Presidential Building has warned that in the current state of emergency, foreign n...

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

Image
చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మ‌హ‌మ్మారి ఎక్కడో వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఐరోపా దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌ది. అంత‌కంటే దూరంగా ఉన్న‌ అగ్ర‌రాజ్యం అమెరికాను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. మొత్తంగా ప్ర‌పంచ దేశాల‌కు పాకిన ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ల‌క్ష మందిని పొట్ట‌న‌పెట్టుకున్న‌ది. ఇంత జ‌రుగుతున్నా చైనాకు స‌మీపంలోనే ఉన్న‌ ఒక దేశం మాత్రం క‌రోనా కోరలకు చిక్కలేదు. ఇంత‌కూ అది ఏ దేశం అనుకుంటున్నారా? అదే వియ‌త్నాం! చైనాకు ద‌గ్గ‌ర‌గా ఉన్నా ఆ దేశంలో క‌రోనా ప్ర‌బ‌ల లేదు. వియ‌త్నాం పాల‌కులు ముందు జాగ్ర‌త్త‌గా చేప‌ట్టిన చ‌ర్య‌లే ఆ దేశాన్ని క‌రోనా బారిన ప‌డ‌కుండా కాపాడాయి. ఈ విజయంలో చిత్రకారుల పాత్ర కూడా ఉంది. లె డక్‌ హిప్‌ అనే ఆర్టిస్టు.. ఒక వ్య‌క్తి క‌రోనాకు వ్య‌తిరేకంగా ఆరోగ్య‌ కార్యకర్తతో చేయి కలిపి నినదిస్తున్న చిత్రాన్ని గీశారు. ఈ బొమ్మ‌తో వేసిన పోస్ట‌ర్లు సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి.  అలాగే పామ్ త్రంగ్ హా అనే మ‌రో కళ‌కారుడు.. క‌రోనా ప‌రీక్ష‌ల్లోనిమ‌గ్న‌మైన సిబ్బంది వెనుక పిడికిలితో ఉన్న చిత్రాన్ని రూపొదించాడు. ఈ చిత్రం కూడా జ‌నాన్ని ఆక‌ట్టుకుంది...

కరోనాతో ఆంగ్ల నటి మృతి

Image
కరోనాతో ప్రముఖ బ్రిటిష్ నటి హిల్లరీ హీత్ శుక్రవారం మృతిచెందారు. ఈ విషయాన్ని ఆమె మనుమడు అలెక్స్ విల్లియమ్స్ పేస్ బుక్ ద్వారా ప్రకటించి ధృవీకరించారు. 74 ఏళ్ల హిల్లరీ బ్రిటన్లోని లివర్పూల్ ప్రాంతంలో జన్మించింది. 1968లో 'విచ్ ఫైండర్ జనరల్' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన హిల్లరీ 1995లో 'ఆఫుల్ల్లీ అడ్వెంచర్', 1997లో 'నిల్ బై మౌత్' అనే సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. హిల్లరీ మృతితో తమ కుటుంబంతోపాటు ఆమె అభిమానులు శోకసంద్రంలో ఉన్నట్లు మనుమడు అలెక్స్ తెలిపారు. -------------------------------------------------------------------------------------------- Celebrity British actress Hillary Heath passed away Friday with Corona. This was confirmed and confirmed by her grandson Alex Williams' Pacebook. 74-year-old Hillary was born in the Liverpool area of ​​Britain. Hillary made her film debut in 1968 with "Witch Finder General" and became very popular with 1995's "Offensively Adventure" and 1997's "Nil by Mouth". Grandson...

'అరుంధతి' విలన్ ఔదార్యం

Image
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూ సూద్ తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్‌ పై పోరాటంలో విశేష కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్‌ను ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. సిబ్బంది తన హోటల్లో ఉండొచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించాడు.  కరోనాపై పోరాడుతున్న వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపాడు. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాము’ అని సోనూసూద్ పేర్కొన్నాడు. కాగా, ముంబై లోని జుహూ ప్రాంతంలో సోనూసూద్ కుటుంబానికి ఆరంతస్తుల హోటల్ వు...

'నిజాముద్దీన్'లో 7000 మందికి నెగెటివ్

Image
కరోనా కారణంగా యావత్ దేశం చూపును తన వైపు తిప్పుకొని, వార్తల్లో నిలిచిన ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాహ్ ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే నిజమొకటి బట్టబయలైంది. ఈ ప్రాంతం నుంచే మొత్తం భారతదేశానికి కరోనా వ్యాపించిందని పనిగట్టుకొని ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తను జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇక్కడి నుంచే కరోనా ప్రబలడం ఎక్కువైందని అరిచిన పలు మైకులు ఇప్పుడు మూగబోయాయి. ఇక అసలు వార్తలోకి వస్తే.. నిజాముద్దీన్ ప్రాంతం నుంచే కరోనా ఎక్కువగా వ్యాపించింది కాబట్టి  స్థానికంగా ఎంతమందిని కబలించిందోననే అనుమానాలను పటాపంచలు చేసే నిజాన్ని అధికారులు ప్రకటించారు. వారి ధ్రువీకరణ ప్రకారం నిజాముద్దీన్ మర్కజ్ చుట్టుపక్కల ఉన్న బస్తీల్లో మొత్తం 1900 ఇండ్లలో నివసించే 7000 మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా.. అందరికి నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయా బస్తీలవాసులు ప్రశాంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తను ప్రముఖ వార్తా సంస్థ "ది టైమ్స్ ఆఫ్ ఇండియా" కూడా అధికారికంగా ప్రచురించింది. కానీ, 'అధికారానికి' కొమ్ము కాసే కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని దాచ...

ఐసోలేషన్ వార్డులో ఆత్మహత్య

Image
ఓ 60 ఏళ్ల  కరోనా అనుమానిత వృద్దుడు  వ్యక్తి శుక్రవారం  తమిళనాడులోని  అరియలూర్ ‌  జిల్లా  ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డ్ లోపల సీలింగ్ ఫ్యాన్ కు  ఉరి వేసుకున్నాడు .  కేరళలో కూలీగా పనిచేస్తున్న   ఈ  వ్యక్తి మార్చి 23 న జిల్లాలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి ఇంటి నిర్బంధంలో ఉన్నాడు . అతను ఏప్రిల్ 6 న స్వచ్ఛందంగా అరియలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఇ తనికి జ్వరం, దగ్గు వంటి COVID-19 లక్షణాలు ఉన్నందున   వైద్యులు   అతని   నమూనాలను   తీసుకొని  ఐసోలేషన్ వార్డుకు   తరలించినట్లు  అరియలూర్ జిల్లా కలెక్టర్ డి . రత్నా  తెలిపారు. ఇదిలా ఉంటే  రోగి  నమూనాల ఫలితాలు కరోనా నెగటివ్ రావడం గమనార్హం! ---------------------------------------------------------------------------------------------------------- A 60-year-old corona suspect was found hanging from a ceiling fan inside the Isolation Ward of Ariyalur district government hospital in Tamil Nad...

కశ్మీర్‌లో భూ ప్రకంపనలు

Image
గురువారం మధ్య రాత్రి కశ్మీర్‌లో భూకంపం సంభవించినట్లు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారి ఒకరు ధృవీకరించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 గా నమోదైనట్లు ఆయన వివరించారు. తాకిందని కశ్మీర్_వెదర్ తెలిపింది. భూకంప కేంద్రం అక్షాంశం 36.54 నార్త్, 71.29 తూర్పు రేఖాంశం వద్ద 212 కిలోమీటర్ల లోతులో ఉందని ఆయన చెప్పారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉందని, కశ్మీర్‌లో దాని ప్రకంపనలు కనిపించాయని, కానీ దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలూ జరుగలేదని ఆయన పేర్కొన్నారు. --------------------------------------------------------------------------------- An earthquake, measuring 4.5 on Richter Scale, hit Kashmir on the intervening night of Thursday & Friday, Kashmir_Weather said. No loss of life or property was reported. The epicenter of the quake was at a depth of 212km at latitude 36.54 North & longitude 71.29 East, he said. Kashmir_Weather added, the earthquake was felt at time of 19:51:36.6 UTC (01:21:36.6 IST). He further said, the epicenter...

ఆఖరి చూపునకు ఐదుగురు మించరాదు..!

Image
కరోనా అనుమానిత/నిర్ధారిత మృతుల అంత్యక్రియలకు ముందు కేవలం ముగ్గురు నుంచి ఐదు మంది కుటుంబసభ్యులు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం లభించనుంది. ఆస్పత్రిలో అయితే సురక్షితమైన గ్లాసు కిటికీ నుంచి మృతదేహాన్ని చూసేందుకు ముగ్గురు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమ తిస్తారు. కుటుంబ సభ్యులను మార్చురీ లోపలికి అనుమతించడం కానీ మృతదేహాన్ని ముట్టుకోవ డానికిగానీ అనుమతి ఉండదు. ముఖం కనిపించే విధంగా మృతదేహాన్ని ప్లాస్టిక్‌ షీట్‌లో చుట్టి, లీక్‌ ప్రూఫ్‌ జిప్‌ బ్యాగులో ప్యాక్‌ చేస్తారు. మృతుడి ముఖం కనిపించేలా బ్యాగు ముందటి భాగం పారదర్శకంగా ఉంటుంది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు వస్తే ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. వారందరూ తమ సొంత రవాణా సదు పాయం ఏర్పాట్లు చేసుకోవాలి. ఆస్పత్రి కోవిడ్‌ లైసన్‌ అధికారి అందించిన మాస్కులు, గ్లౌజులు ధరించాలి. 4 మీటర్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ హిందూ/ముస్లిం సాంప్రదాయం ప్రకారం ప్రదక్షిణ/ నమాజ్‌–ఏ–జనాజ నిర్వహించేందుకు అనుమతిస్తారు. హిందువులైతే 3 మీటర్ల పొడవైన కట్టెతో కాష్టానికి నిప్పుపెట్టాలి. మృతదేహానికి చుట్టూ 4 మీటర్ల దూరం వరకు రోప్‌ బ్యారికేడ...

సామూహికంగా కరోనా మృతుల ఖననం

Image
కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్‌ సమీపంలోని ఓ ద్వీపం(హార్ట్‌ ఐలాండ్‌)లో సామూహిక ఖననం చేశారు. భారీగా కరోనా మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారుగానీ ఎవరూలేకుండానే అంత్యక్రియలను నిర్వహించారు. ఇ‍ప్పటి వరకు న్యూయార్క్‌ నగరంలోనే దాదాపు 1 లక్షా 59 వేల మంది కరోనా బారిన పడగా దాదాపు 7067 మంది మృతిచెందారు. ఇక అమెరికా వ్యాప్తంగా 4,68,703 మందికి కరోనా సోకగా, 16, 679 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షల మందికి కోరానా సోకగా, 95 వేల మంది మృతిచెందారు. -------------------------------------------------------------------------------- US financial capital New York's situation has worsened following the Corona pandemic. The bodies were buried on an island near the Bronx in New York (Hart Island). Huge corona bodies were placed in white boxes, buried in a pile of p...

ఏడుగురి నడుమ మూడు ముళ్లు

Image
కరోనా వేళ కల్యాణం తీరే వేరు. పెళ్లంటే ..సందళ్లు..తప్పెట్లు..తాళాలు.. ఇవేవి లేకుండానే రెండు పెళ్లిళ్లు కేవలం ఏడుగురు అతిథులే సాక్షులుగా వివాహ తంతులు ముగిశాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా పరిమితమైన జనం అంటే కేవలం ఏడుగురితోనే పెళ్లి తతంగం పూర్తి చేసేందుకు అనుమతులు ఉండటంతో రెండు జంటలు గురువారం రాత్రి ఒక్కటయ్యాయి. వివరాలిలా ఇలా ఉన్నాయి. గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు ఏడుగురు, తాకాశి వీధిలో పెళ్లికొడుకు ఈశ్వరరావుతో పాటు ఏడుగురు మాత్రమే ఉండేటట్లు పెళ్లి తతంగం పూర్తి చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో రెండు పరిణాయాలు జరిగాయి. ----------------------------------------------------------------- The wedding cables ended with just two guests witnessing the two weddings. The lockdown was set in the wake of the corona, and the couple was united on Thursday night with only seven people allowed to complete the marriage. In Gavarapalem, there were only seven, along with Mahesh, the son of t...

ప్రేమ కోసం పాదయాత్ర !

Image
కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన వేళ.. ఓ యువతి మాత్రం ప్రేమించిన వాడికోసం ఏకంగా 40 కిలోమీటర్లు ఒంటరిగా నడిచివెళ్లింది. కుటుంబ సభ్యుల బెదిరింపులు.. కరోనా భయాలు ప్రియుడి చెంతకు చేరేందుకు ఆమెకు అడ్డుకాలేదు. మొండి ధైర్యంతో ముందుకు సాగిన సదరు యువతి ఎట్టకేలకు ప్రేమించినవాడితో మూడు ముళ్లు వేయించుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయి పున్నయ్య, హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన సీహెచ్‌ భవానీ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు.  వారి విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పున్నయ్యకు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారు. దీంతో ప్రేమికులిద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో భవానీ హనుమాన్‌ జంక్షన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నానికి ఒంటరిగా బయల్దేరి వెళ్లి ప్రేమించినవాడిని కలుసుకుంది. అక్కడ పున్నయ్య, భవానీ బుధవారం వివాహం చేసుకున్నారు. వారి వినతిపై పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి, నూతన జంటను వారివెంట పంపించారు. -----------------------------------------------------------------------...

మంచికి చెబితే దాడి చేశారు..

Image
ప్రముఖ నటుడు రియాజ్‌ఖాన్‌పై కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన నటుడు రియాజ్‌ ఖాన్‌. ఈయన భార్య ఉమా రియాజ్‌ ఖాన్‌ కూడా నటినే. కాగా, రియాజ్‌ఖాన్‌ చెన్నై సమీపంలోని సముద్రతీరంలో ఉన్న పన్నయార్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాగా రియాజ్‌ఖాన్‌ బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో వ్యాయామం చేసుకుంటున్నారు. అదేసమయంలో ఆ ప్రాంతంలో కొంతమంది గుంపుగా చేరి ముచ్చటించుకుంటున్నారు. దీంతో రియాజ్‌ఖాన్‌ వారిని సమీపించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నిబంధనలు విధించింది మీరు వాటిని పాటిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోండని హితవు పలికారు. అయితే, వారిలో కొందరు రియాజ్‌ఖాన్‌ను తిరగబడి మాట్లాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గుంపులోని ఒకరు రియాజ్‌ఖాన్‌పై దాడి చేశారు. దీంతో కనత్తూరు పోలీసుస్టేషన్లో రియాజ్ఖాన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ---------------------------------------------------------- On Wednesday, some people attacked the famous actor Riyaz...

ఆంక్షలను అధిగమించిన అమ్మ ప్రేమ

Image
లాక్ డౌన్ ఆంక్షలను అధిగమించిన ఓ అమ్మ సుదీర్ఘ ప్రయాణం చేసి వేరే ఊరిలో చిక్కుకున్న తన కొడుకును ఇంటికి తెచ్చుకుంది. సుదీర్ఘ ప్రయాణమంటే ఏ వంద కిలోమీటర్లు కూడా కాదు.. ఏకంగా 1400 కిలోమీటర్లు! ఆ తల్లి చేసిన సాహసానికి ఇప్పుడు అందరూ సలామ్‌ చేస్తున్నారు. బోధన్‌కు చెందిన రజియాబేగం ప్ర భుత్వ పాఠశాలలో టీచర్‌. ఆమెకు ఇద్దరు కుమారు లు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పటినుంచి పిల్లల ఆలనాపాలనా ఆమే చూస్తోంది. చిన్నవాడైన మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు బోధన్‌లో ఇంటర్‌ చదివాడు. అతడి ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షల కోసం గత నెల ఇద్దరు కలసి హైదరాబాద్‌ నుంచి బోధన్‌కు వచ్చారు. స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అతడికి తోడుగా నిజాముద్దీన్‌ మార్చి 12 నెల్లూరుకు వెళ్లాడు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో అతడు చిక్కుకుపోయాడు. ఇది తెలిసి తల్లి రజియాబేగం ఆందోళనకు గుర య్యారు. బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డిని కలిసి పరిస్థితి ని వివరించా...

మర్కజ్ పై అబద్ధాలు ప్రసారం చేసిన పాత్రికేయులపై కేసు

Image
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కి అవమానాలపాలైన తబ్లీఘీ జమాత్ ఢిల్లీ మర్కజ్ పై దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిన ముగ్గురు పాత్రికేయులపై కేసు నమోదైంది.  మహారాష్ట్ర నివాసి షోయబుల్లా ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు ఎబిపి న్యూస్ (ఎబిపి న్యూస్) చీఫ్ ఎడిటర్‌ అశోక్ కుమార్, రొమానా ఇస్రార్ ఖాన్, రుబికా లియాఖత్, ఇండియా టీవీకి చెందిన రజత్ శర్మ, జీ న్యూస్‌కు చెందిన సుధీర్ చౌదరిపై నకిలీ, అసత్య వార్తలు ప్రసారం చేసినందుకు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులపై 295ఎ సెక్షన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ------------------------------------------------------------------------- A case has been registered against three journalists who have been taunting false news about Tablighi Jamaat, the Delhi Markaz, who have been the subject of insults across the country due to corona.  The Maharashtra police have lodged a compla...

ఐసోలేషన్ వార్డులో అత్యాచారం

Image
ఒక వైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన ప్రజలను నయం చేయడంలో వైద్యులు పగలూరాత్రీ ప్రాణాలకు తెగించి కృషి చేస్తుంటే, మరొక వైపు కొంతమంది వైద్యులు ఆ వృత్తికే మచ్చ తెస్తున్నారు. బిహార్ రాష్ట్రంలో ఇలాంటి వార్తలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్ లోని గయాలో ఉన్న అనుగ్రహా నారాయణ్ మెడికల్ కాలేజీలో ఏకంగా కరోనా ఐసోలేషన్ వార్డులోనే ఓ రెండు నెలల గర్భిణిపై అత్యాచారం చేసాడో దుర్మార్గపు డాక్టర్! అత్యాచారం తరువాత అధిక రక్తస్రావం కారణంగా ఆ 24 ఏళ్ల యువతీ మృత్యువాత ;పడటం శోచనీయం! బాధితురాలు కూడా మొదట ఈ సంఘటనను దాచడానికి ప్రయత్నం చేసినా, ఆ తర్వాత అసలు విషయాన్ని బయట పెట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి.. లాక్డౌన్ తర్వాత మార్చి 25న పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నుండి తిరిగి వచ్చిన మహిళను గయా యొక్క అనుగ్రహ నారాయణ్ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చారు. బాధితురాలు 2 నెలల గర్భవతి కావడంతో గర్భస్రావం కారణంగా ఎక్కువ రక్తస్రావం జరిగిందని తెలుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో గయా హాస్పిటల్ యొక్క అత్యవసర వార్డుకు తీసుకువచ్చారు. కరోనా...

అయ్యో పాపం.. అయోధ్య కోతులు..!

Image
అయోధ్య న‌గ‌రం.. భ‌క్తుల‌తో గుళ్లు ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. ఎప్పుడూ భ‌క్తుల‌తో ర‌ద్ధీగా ఉండే ఈ ప్ర‌దేశం క‌రోనా ప్ర‌భావంతో గుళ్లు మూత‌బ‌డ్డాయి. దాంతో భ‌క్తుల రాక త‌గ్గింది. భ‌క్తులు ఇచ్చే ప్ర‌సాదంతో క‌డుపు నింపుకునే కోతుల‌కు ఆహారం దొర‌క్క బ‌క్క‌చిక్కిపోతున్నాయి. క‌డుపు కాల‌డంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి. అయోధ్య‌లోని జనంపై దాడికి దిగుతున్నాయి.  ఆకలికి తట్టుకోలేక మందలు మందలుగా ఇళ్లలోకి చొరబడుతున్నాయి. అడ్డుకున్నవారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయోద్య‌లో 7,000 నుంచి 8,000 కోతులు ఉన్నాయి. ఇన్నేళ్ల చరిత్రలో వానర జాతికి ఇంత కష్టం ఎప్పుడూ రాలేదు. భ‌క్తులు ఇచ్చే అర‌టిపండు, రొట్టె, పూరి లాంటివి వారు పెడితేనే తినేవి. అంతేకాని లాక్కునేవి కాదంటున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. కరోనా వల్ల గుళ్లకు జనం రావడం మానేయడంతో పాపం వానరులు ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. ఇంత‌కుముందు గ్రాస‌రీ షాపులు ఉన్న‌వాళ్లు ప‌ప్పులు, ధాన్యాలు వంటి ఆహార‌పు గింజ‌లు కోతుల‌కు వేసేవారు. ఇప్పుడు అలావేస్తే వారికే స‌రిపోదు. కొనుక్కోవ‌డానికి కూడా స‌దుపాయం లేదు. అలాంట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వాడుకోవాలంటున్నారు షాపు య‌జ‌మ...

అనుమానాస్పదంగా యాంకర్ మృతి !

Image
ఇటీవ‌లి కాలంలో బుల్లితెర న‌టీమ‌ణులు అనుమానాస్ప‌దంగా మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. తాజాగా యాంక‌ర్, సీరియ‌ల్ న‌టి శాంతి (విశ్వ‌శాంతి) గురువారం క‌న్నుమూశారు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలో నివాసం ఉండే శాంతి నాలుగు రోజులుగా ఇంటి నుండి బ‌య‌ట‌కి రావడం లేదు. అనుమానం వ‌చ్చి చుట్టు ప‌క్క‌ల వారు చూడ‌గా, గ‌దిలో ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, లేక మ‌రేమైన‌ కార‌ణం తో చ‌నిపోయారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. --------------------------------------------------------------------------------- The recent death of suspicious actresses in the recent past is worrying. The latest anchor, serial actress Shanti (Viswasti), passed away Thursday. Peace of residence at Ellareddy Goode Engineers Colony, under the Essar Nagar Police Station, has been absent from home for four days. She looked around and saw her corpse in the room. Knowing the information,...

మందు దొరక్క నటి మనోరమ కొడుకు ఆత్మహత్యాయత్నం!

Image
లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద్యం షాపులు కూడా మూత ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు మందు బాబులు మ‌ద్యం దొర‌క్క‌పోయే స‌రికి విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డమే కాక‌, ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి మ‌నోర‌మ కుమారుడు మ‌ద్యం దొర‌క‌డం లేద‌నే బాధ‌తో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగారని వార్త‌లు వ‌స్తున్నాయి. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు స‌మాచారం. తమిళంతో పాటు ప‌లు తెలుగు సినిమాల‌లో న‌టించిన మ‌నోర‌మ త‌న‌యుడు భూపతి స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. మ‌ద్యం దొర‌క్క‌పోవ‌డంతో మ‌త్తు కోసం నిద్ర మాత్ర‌లు వేసుకున్నారు. మోతాదు ఎక్కువ కావ‌డంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌లేద‌ని భూప‌తి త‌న‌యుడు రాజ‌రాజ‌న్ చెప్పుకొచ్చారు. ద‌య చేసి లేనిపోని వ‌దంతులు పుట్టించ‌వ‌ద్ద‌ని కోరారు. --------------------------------------------------------------------------------- Liquor shops have been reported to have closed as a lockdown factor. However, some drug add...

అమెజాన్ అధిపతే.. అత్యధిక సంపన్నుడు

Image
క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ అమెజాన్ ఫౌండ‌ర్‌, సీఈవో జెఫ్ బేజోస్ ప్ర‌పంచ సంప‌న్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ త‌న 34వ‌ వార్సిక బిలియ‌నీర్ల జాబితాను రిలీజ్ చేసింది. 113 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో జెఫ్ బేజోస్ తొలి స్థానంలో నిలిచారు. రెండ‌వ స్థానంలో 98 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో బిల్ గేట్స్ నిలిచారు. ఎల్‌వీఎంహెచ్ సంస్థ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ .. ఫోర్బ్స్ జాబితాలో మూడ‌వ స్థానానికి ఎగ‌బాకారు. ఆయ‌న సంప‌ద 76 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది. ఇక వారెన్ బ‌ఫెట్ నాలుగ‌వ స్థానానికి ప‌డిపోయారు. బ‌ఫెట్ ఆస్తులు 67.5 బిలియ‌న్ డాల‌ర్లు ఉన్న‌ట్లు ఫోర్బ్స్ పేర్కొన్న‌ది. అయితే తాజా లిస్టులో జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ బేజోస్ చేర‌డం గ‌మ‌నార్హం. 36 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో ఆమె లిస్టులో 22వ స్థానంలో నిలిచారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల సంప‌న్నుల జాబితా నుంచి సుమారు 267 మంది ఔట‌య్యారు. దాదాపు వెయ్యి మంది వ‌ర‌కు త‌మ ఆస్తుల‌ను కోల్పోయారు. --------------------------------------------------------------------------------- Amazon founder and CEO Jeff Bezos became the richest man in the world during Corona. Forbe...

ఒక్క 'మందు' అందరినీ మన వైపు తిప్పింది !

Image
“ హైడ్రాక్సి క్లోరోక్విన్ ” ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీనిగురించే చర్చించుకుంటోంది . నిన్న మొన్నటి వరకు కరోనాకి ఒక నిర్ధిష్టమైన మందు అంటూ ఏది లేదు , దేశాలన్ని అనేక రకాల మందులని వాడారు , కాని వాటన్నింటిలోకి హైడ్రాక్సి క్లోరోక్విన్ అనే మందు ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు . అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలన్ని ఇప్పుడు ఇండియావైపు దృష్టి సారించాయి .  అంత పెద్ద దేశం ఎందుకు ఈ మందుని ప్రోడ్యూస్ చేస్కోలేకపోయింది ? మన దేశానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుందో   చదవండి . కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం మొత్తం స్తంబించిన విషయం తెలిసిందే , ఇప్పుడున్న అవసరాలరీ త్యా ఔషదాలపై ఎగుమతిని కూడా నిషేదించారు . అమెరికాలో రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి , మందు నిల్వలు సరిపడా లేవు . దాంతో ఆ నిషేదాన్ని ఎత్తివేసి తమకు మందు పంపించాల్సిందిగా ముందు ట్రంప్ ఇండియాని రిక్వెస్ట్ చేశారు . మా దేశానికి సరిపడా మందులని నిల్వ ఉంచుకున్నాక పంపిస్తామని మోడీ సమాధానం ఇవ్వడంతో , మందు పంపిచకపోతే ప్రతికారం తీర్చు...