Posts

Showing posts from March 22, 2020

అమ్మ చనిపోయినా..

Image
కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి దేశవ్యాప్తంగా   లాక్డౌన్ కొనసాగుతుంది . ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో   పారిశుధ్య కార్మికులు కీలక  పాత్ర పోషిస్తున్నారు . ఇందుకు  నిర్వహిస్తున్న అష్రఫ్ అలీ   అనే ఓ కార్మికుడి జీవితంలో జరిగిన సంఘటనే ఉదాహరణ ! అష్రఫ్ అలీ 67 ఏళ్ల తల్లి నూర్ జహాన్ బుధవారం ఉదయం మరణించారు . అయినా  అష్రఫ్   అలీ   మధ్యాహ్నం   తన తల్లి అంత్యక్రియలను  పూర్తి చేసి, మళ్లీ  రెండు గంటల తరువాత అంటే  సాయంత్రం తన పనికి తిరిగి వచ్చాడు . సీనియర్ ఆఫీసర్లు  ఈ  తెలుసుకొని  అతన్ని  ఇంటికి కోరినా , అష్రాఫ్ ఇంటి బాధ్యత కంటే..  ' ఈ బాధ్యత చాలా పెద్దది ' అని   అధికారులకు చెప్పిన సమాధానం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమందికి స్ఫుర్తిగా నిలుస్తుంది.  అష్రాఫ్   గత   కొన్నేళ్లుగా   నీటి పనుల విభాగంలో  మురుగునీటి వాహనాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు . ఈ సందర్బంగా  అష్రాఫ్ మాట్లాడుతూ , ' నా తల్లి ప్రపంచం నుండి వెళ్లిపోయింది , ఆమె వెళ్ళిపోయినా ...

పిల్లికి పాజిటివ్ !

Image
కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 వేల మందికి పైగా మృతి చెందారు. ఇటలీ, స్పెయిన్‌, అమెరికా దేశాల్లో కరోనా వైరస్‌ బారిన పడ్డ జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు కరోనా మనషులకే సోకడం చేశాం. పెంపుడు జంతువులకు కూడా కరోనా వ్యాప్తిస్తోంది. హాంగ్‌కాంగ్‌లో కుక్కకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెంపుడు పిల్లికి కూడా కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బెల్జియంకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన పెంచుకుంటున్న పిల్లికి కూడా కరోనా సోకింది. దీంతో పిల్లిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని వైద్యులు ఆదేశించారు.  అయితే కుక్కలో కరోనా లక్షణాలు కనిపించలేదు. కానీ ఈ పిల్లిలో మాత్రం కరోనా లక్షణాలు కనిపించాయి. పిల్లి శ్వాస కోశ సమస్యలతో బాధపడుతోంది. అంతే కాకుండా అజీర్ణ సమస్యలు తలెత్తినట్లు బెల్జియం ఫుడ్‌ సేఫ్టీ ఏజెన్సీ ఏఎఫ్‌ఎస్‌సీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే పెంపుడు జంతువుల నుంచి మనషులకు, ఇతర జంతువులకు కరోనా వ్యాప్తి చెందకపోవచ్చు అని బెల్జియం అధికార వర్గాలు పేర్కొన్నాయి. కరోనా సోకిన బాధితులు ఎవరైనా ...

2 నెలలు.. 15 లక్షలు..!

Image
కరోనా కేసుల వృద్ధిరేటులో కాస్త తగ్గుదల కనిపిస్తున్నదంటూ స్వల్ప ఉపశమనం కలిగించిన కేంద్రం .. 24 గంటలు గడువకముందే ఓ బాంబు పేల్చింది . విదేశాల నుంచి గత రెండు నెలల్లో మన దేశంలోకి దాదాపు 15 లక్షల మంది వచ్చారని తెలిపింది . వారిపై సరైన నిఘా లేదని వెల్లడించింది . వెంటనే రాష్ర్టాలు చర్యలు తీసుకోవాలని , వారిపై నిఘా పెంచాలని సూచించింది . ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ‌ సెక్రటరీ రాజీవ్ ‌ గుహా గురువారం అన్ని రాష్ర్టాలు , కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు . ఇమ్మిగ్రేషన్ ‌ బ్యూరో ఇచ్చిన వివరాలమేరకు జనవరి 18 వ తేదీ నుంచి మార్చి 23 వ తేదీ మధ్య 15 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు భారత్ ‌ కు వచ్చారని తెలిపారు . ప్రస్తుతం ఆయా రాష్ర్టాల్లో పరిశీలనలో ఉన్న విదేశీ ప్రయాణికుల సంఖ్యకు , అసలు సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉన్నదన్నారు . ఈ 15 లక్షల మంది విమానాల ద్వారా వచ్చినవారు మాత్రమేనని , సముద్రమార్గంలో , అంతర్జాతీయ సరిహద్దుల గుండా వచ్చినవారు అదనమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి .  కొత్త కేసులు...

మహామహులకు మహమ్మారి

Image
బ్రిటన్ ‌ ప్రధాని బోరిస్ ‌ జాన్సన్ ‌ కు కరోనా సోకింది . ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ‌ ద్వారా శుక్రవారం వెల్లడించారు . గత 24 గంటల నుంచి స్వల్పంగా వైరస్ ‌ లక్షణాలు కనిపించాయని , పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ ‌ వచ్చినట్లు తెలిపారు . ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు . కరోనాని ఎదుర్కొనేందుకు వీడియో కాన్ఫరెన్స్ ‌ ద్వారా తాను ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు . బ్రిటన్ ‌ వైద్య శాఖ మంత్రి మ్యాట్ ‌ హ్యాంకాక్ ‌ కు కూడా వైరస్ ‌ సోకింది .  బ్రిటన్ ‌ రాణి ఎలిజబెత్ ‌-2 పెద్ద కుమారుడు ప్రిన్స్ ‌ చార్లెస్ ‌ కు కరోనా సోకింది . భార్య కెమెల్లాతో కలిసి స్కాట్లాండ్ ‌ లోని నివాసంలో ఐసొలేషన్ ‌ లో ఉన్నారు .  లైంగిక నేరారోపణలు రుజువుకావడంతో 23 ఏండ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న ప్రముఖ హాలీవుడ్ ‌ నిర్మాత హార్వే విన్ ‌ స్టీన్ ‌ కు జైళ్లో కరోనా సోకింది . భారత్ ‌ లో కరోనా బారిన పడిన మొదటి సెలబ్రిటీ కనికాకపూర్ ‌ , ఆస్కార్ ‌ అవార్డు గ్రహీత టామ్ ‌ హాంక్స్ ‌, ఆయన భార్య రీటా విల్సన్ ‌ కూడా కరోనా బారినపడ్డార...