Posts

Showing posts from May 17, 2020

యోగి సర్కార్ మరో దుర్మార్గ చర్య

Image
ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ మరో దుర్మార్గమైనచర్యకు పాల్పడింది. ఇప్పటికే కార్మిక చట్టాలను కాలరాసిన ప్రభుత్వం ఇప్పుడు ఎస్మా ప్రయోగించింది. ఆరు నెలల పాటు అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తూ యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ʹʹఈ గెజిట్ నోటిఫికేషన్ వెలువడినది మొదలు వచ్చే ఆరు నెలల పాటు రాష్ట్రంలో ప్రజా సేవలను స్తంభింపజేయడంపై నిషేధం విధించేందుకు గవర్నర్ సమ్మతించారు. ఈ ఆరు నెలలు ప్రభుత్వం, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఆధీనంలోని ఎలాంటి సేవలైనా నిలిపివేయడం నిషేధం...ʹʹ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్మా చట్టం అమల్లో ఉండగా పోస్టల్, టెలీగ్రాఫ్, రైల్వే, పోర్టు కార్యకలాపాలు సహా అత్యవసర సేవల విభాగాలకు చెందిన ఉద్యోగులెవరూ సమ్మె చేసేందుకు వీల్లేకుండా నిషేధం కొనసాగుతుంది. దీన్ని ఉల్లంఘించిన పక్షంలో ఏడాది పాటు జైలుశిక్ష లేదా వెయ్యి రూపాయలు జరిమానా లేదా రెండూ వ...

ఇక గుమ్మం ముందుకే మద్యం !

Image
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి జొమాటోలు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్రం ఓకే చెప్పింది. దీంతో ఇక క్యూలైన్ లో మద్యం కోసం నిలబడడానికి నామోషీగా ఫీలయ్యే వారు.. బిజీగా ఉండి ఇక మద్యం షాపుకు వెళ్లలేని వారికి ఈ రెండు సంస్థలు మద్యం హోం డెలివరీ చేస్తాయి. ఫుడ్ తోపాటు మద్యం ను కూడా డెలివరీ చేసేందుకు ఈ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. స్విగ్గీ జొమాటోలు ఇక నుంచి మద్యం హోం డెలివరీ చేయనున్నాయి. ఈ మేరకు తొట్టతొలిగా జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇవాళ మద్యం హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించాయి. దీనికోసం యాప్ లో ‘వైన్ షాప్స్’ అనే ఆప్షన్ ను ప్రవేశపెట్టాయి. ఇక 18 ఏళ్లలోపు వారు వయసు ధ్రవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా కార్డుతో సెల్ఫీ దిగి అందులో పోస్టు చేయాలి. మైనర్లకు మద్యం అమ్మకుండా యాప్ లో మార్పులు చేశారు. ఓటీపీ ద్వారా మద్యం డెలివరీ చేస్తారు. మద్యం కోసం క్యూలు కట్టడాలకు ఇక చెక్ పడనుంది… బడాబాబులు అందరూ కూడా ఇంట్లోనే ఉండి మద్యం తెప్పించుకునే వీలు కలగనుంది. --------------------------------------------------------------- ...

జైల్లోనే చచ్చిపోతాననుకున్నా..

Image
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తిండి కోసం కొట్టుకోవడం, పిల్లి-ఎలుకల్లా దెబ్బలాడుకోవడం... ఇది ఇండియాలోని జైళ్లలో వారు రోజూ ఎదుర్కొన్న పరిస్థితి. ఇరాక్, అఫ్గానిస్తాన్‌ దేశాల్లో పని చేసిన ఈ బ్రిటన్ మాజీ సైనికుడు జైల్లో ఎదురైన పరిస్థితులతో ఎలా పోరాడారో తాను రాసిన ఓ పుస్తకంలో చెప్పుకొచ్చారు. రాళ్లతో పరచిన గచ్చుపై ఆయన పడుకునేందుకు ఓ బొంత.. భారతీయ శైలిలో నిర్మించిన శిథిలావస్థలో ఉన్న శౌచాలయం.. తినడానికి పాడైపోయిన కారెట్లు, బంగాళ దుంపలు. చూడ్డానికి అంత స్పష్టంగా లేని ఆ ఫోటోలన్నింటినీ నిక్ తన వద్దనున్న స్పై పెన్‌తో చిత్రీకరించారు. నిజానికి ఆయనతో పాటు చైన్నై జైల్లో ఉన్న ఆయన సహచరులు రెండున్నర ఏళ్ల పాటు ఎదుర్కొన్న పరిస్థితులకి ఆ ఫోటోలు అద్దం పడతాయి. “జైలు గదులు అధ్వాన్నంగా, మురిగ్గా ఉండేది. ఏ రోజు చూసినా అదే పరిస్థితి” అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం నార్తంబర్‌లాండ్‌లోని అషింగ్టన్‌లో ఉన్న నిక్. నిక్ సహా తన ఐదుగురు స్నేహితులు కూడా సైన్యంలో పని చేసేవారు. 2013లో ఎంవి సీమన్ గార్డ్ ఒహియో నౌకలో హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో భారతీయ కోస్ట్ గార్డ్ దళాలు వారిని బంధించనంత వ...

ఆ రాజ్యాన్ని పగలూ రాత్రీ పంచుకున్నాయి !

Image
నార్వేలోని దీవుల సముదాయంలో గల స్వాల్బార్డ్ దీవికి విమానాల్లో వస్తున్నపుడు కిటికీల్లో నుంచి చూస్తే ముందుగా కనిపించేది మంచు టోపీలు పెట్టుకున్నట్లుండే పర్వతాలు. అదికూడా సంవత్సరంలో ప్రకాశవంతంగా ఉండే సగం కాలంలో వస్తేనే. ఈ కాలంలో అర్థరాత్రి కూడా సూరీడు ఉంటాడు.. వారంలో ప్రతి రోజూ 24 గంటలూ కనిపిస్తాడు. మిగతా అర్థ సంవత్సరంలో చీకటి రాజ్యమేలుతుంది. తరచుగా ఉత్తర కాంతి మెరుపులీనుతూ నాట్యం చేస్తుంటుంది. నార్వే ప్రధాన భూభాగానికి ఉత్తరంగా 800 కిలోమీటర్ల దూరంలో.. ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో ఉంటుంది స్వాల్బార్డ్. ఇది ప్రపంచంలో ఉత్తర కొసన ఏడాది పొడవునా జనం ఉండే ఆవాస ప్రాంతం. ప్రపంచంలో ఉత్తరాన చిట్టచివరన గల యూనివర్సిటీ, చర్చి, బ్రూవరీ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా నివసించగలిగే అతి తక్కువ ప్రాంతాల్లో ఇదొకటి. స్వాల్బార్డ్ రాజధాని లాంగియర్బన్‌లో నివసించే 2,400 మంది జనాభాలో దాదాపు మూడో వంతు మంది వలస వచ్చినవారే. వారు 50 పైగా దేశాల నుంచి వచ్చారు. ఏ దేశ పౌరులైనా సరే ఒక ఉద్యోగం, నివసించటానికి ఒక ఇల్లు ఉంటే చాలు.. ఇక్కడ స్థిరపడొచ్చు. ఈ ప్రాంతానికి మొదటిగా 1,200 సంవత్సరం ప్రాంతంలో వైకింగులు వచ్చారని భా...

ఆవు పై అత్యాచారం

Image
అత్యంత జుగుప్సాకరమైన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. మానవ జాతి సిగ్గు పడాల్సిన సంఘటన ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కామం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆవు మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇవే.. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చాచోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగంజ్ కు చెందిన ఓ మూగవాడు శనివారం అర్ధరాత్రి ఆవుపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానిక నివాసి భవనంపై నుంచి ఆ అఘాయిత్యాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు ఈ ఘటనను ఖండించారు. ఈ వీడియోను చూసిన స్థానికుడు ముఖేష్ శర్మ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ----------------------------------------------------------- The most disgusting event has come to light in Madhya Pradesh. T...

'బాబు'కు మరో షాక్ !

Image
ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటివి తెలుగు రాజకీయాల్లో కొత్త కాకున్నా.. ఇటీవల కాలంలో మాత్రం మరింతగా పెరిగిపోయాయి. తాము అధికారపక్షంలో లేకుంటే ఊపిరి ఆడనట్లుగా ఫీలయ్యే నేతలు పెరిగారు. దీంతో.. పవర్ లో ఉన్నప్పుడు ఒకలా.. పవర్ చేజారిన వెంటనే మరోలా వ్యవహరించే తీరు అంతకంతకూ పెరుగుతోంది. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బాబుకు భారీగా పంచ్ లు ఇస్తూ.. తెలుగు తమ్ముళ్లు పలువురు పార్టీని వదిలేసి వెళ్లిన వైనం తెలిసిందే. లాక్ డౌన్ వేళలోనూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు.. మరో మాజీ మంత్రి ఇద్దరూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు రెఢీ అవుతున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతోంది. సైకిల్ మీద ప్రయాణం కష్టంగా మారిందని.. ఎంచక్కా ఫ్యాన్ కింద కూర్చొని చల్లటి గాలికి సేద తీరాలని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు పార్టీలో చేర్చటం తెలిసిందే. ఎమ్మెల్సీ పోతుల సునీత..చీరాల ఎమ్మెల్యే కమ్ టీడీపీకి వీర విధేయుడిగా చెప్పే కరణం బలరాంతోపాటు.. తన కుమారుడ్ని అధికార పార్టీలో చేర్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా పార...

తెలంగాణ కోవిడ్ టెస్టులు త‌క్కువ‌గా చేస్తోందా..?

Image
క‌రోనావైర‌స్ నిర్ధర‌ణ ప‌రీక్ష‌లను ఎక్కువ‌గా చేయ‌డంలేద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి కోరారు. అయితే తాము భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌క్కాగా అనుస‌రిస్తూ త‌గిన‌న్ని ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూదన్ మే7న రాసిన లేఖ‌ను ది ప్రింట్ ప్రచురించింది. రాష్ట్రంలో చేస్తున్న‌ టెస్టులను సమీక్షించాల‌ని, సంఖ్యనూ పెంచాలని లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కోరారు. దిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడుల‌తో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని గుర్తు చేశారు. గ‌త ఏడు రోజులుగా మాత్రం.. గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే, గత ఏడు రోజుల్లో మాత్రమే తెలంగాణలో టెస్టుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన లేఖలు, హైకోర్టు విచారణలే దీనికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం మే 20 నాటికి తెలంగాణలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 30,076. వీటిలో 1,661 పాజిటివ్ కేసులు ...

పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది -:- ఆర్బీఐ గవర్నర్ దాస్

Image
భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. ప్రైవేట్ వినియోగం దారుణంగా పడిపోయిందని చెబుతూ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. అంటే, ఇప్పుడున్న 4.4 శాతం నుంచి రెపో రేట్ 4 శాతానికి తగ్గుతుందని శక్తికాంత దాస్ అన్నారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు, మార్చి 27న కూడా ఆర్థిక వృద్ధి రేటును వేగవంతం చేయడం రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను నిరర్థకంగా అటి పెట్టుకోకుండా ఉండేలా చేసేందుకు రివర్స్ రెపో రేటును కూడా 3.75 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఇప్పుడు మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా, మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థికరంగం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు నెలల వ్యవధిలో ఇది ఆర్బీఐ ఏర్పాటు చేసిన మూడో మీడియా సమావేశం. ఆర్‌బీఐ గవర్నర్ ఇంకా ఏమన్...

అప్పుడే పుట్టిన ఆ చిన్నారులు ఎలా ఉన్నారు?

Image
ముంబయి నగరంలో కరోనావైరస్ సోకిన గర్భిణులు 100 మందికి పైగా బిడ్డలకు జన్మనిచ్చారు. గత నెలలో లోక్ మాన్య తిలక్ హాస్పిటల్లో జన్మించిన 115 మంది శిశువులలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కానీ, వారు వ్యాధి నుంచి కోలుకున్నట్లు తర్వాత నిర్వహించిన పరీక్షలు వెల్లడించాయి. ఇద్దరు గర్భిణులు కోవిడ్ సోకి మరణించారు. అందులో ఒకామె బిడ్డకు జన్మనివ్వక ముందే మరణించారు. ముంబయిలో ఇప్పటికే 20 వేలకు పైగా మంది కోవిడ్ 19కు గురైనట్లు నమోదు కాగా, 730 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో, భారత ఆర్ధిక రాజధాని కోవిడ్‌కు కేంద్రంగా మారింది. సియోన్ హాస్పిటల్లో సగం మంది శిశువులు కరోనావైరస్ సోకిన తల్లులకు జన్మించారు. ఇందులో చాలా మందికి సిజేరియన్ చేసి కాన్పు చేయవలసి రాగా, మిగిలినవి సహజ ప్రసవాలు అని వైద్య అధికారులు చెప్పారు. అందులో 56 మంది మగ శిశువులు ఉండగా 59 మంది ఆడ శిశువులు ఉన్నారు. కరోనావైరస్ సోకిన 22 మంది మహిళలు ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చారు. అయితే, వీరికి వైరస్ ఇంటి వద్ద ఉన్నప్పుడే సోకిందా లేక హాస్పిటల్ వార్డులో సోకిందా అనేది తెలియదు. 40 బెడ్లు ఉన్న ప్రత్యేక వార్డులో 65 మంది డాక్టర్లు, 24 మంది నర్సులతో కూడిన వైద్య...

పైసే వాలా భగవాన్.. లాక్ డౌన్ తో పరేషాన్ !

Image
కోవిడ్-19 సంక్షోభం ప్రభావం దేశంలోని ఒక ధనిక దేవాలయంపై పడింది. అదే కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ గుడికి వచ్చే భక్తులు ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈ దేవాలయం ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదని అంటున్నారు. సగటున రోజుకు 2 లక్షల రూపాయలు, హుండీ కానుకల రూపంలో మరో లక్ష రూపాయల వరకూ ఆదాయం ఈ గుడికి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌ విరాళాల రూపంలో రోజూ 10 నుంచి రూ. 20 వేల రూపాయల ఆదాయం మాత్రమే వస్తోంది. ‘‘గుడి కోసం ఉన్న 307 మంది సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు బ్యాంకు డిపాజిట్లు, ఇతరత్రా డిపాజిట్లపై వచ్చే వడ్డీపై ఆధారపడుతున్నాం. ఆలయ ఖర్చుల కోసమని నా జీతం నుంచి 30 శాతం ఆలయ నిధికే ఇస్తున్నా’’ అని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. రతీశన్ బీబీసీతో చెప్పారు. ‘‘భారత్‌లోనే ధనిక దేవాలయాల్లో మాది ఒకటి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి మా గుడికి చాలా మంది భక్తులు వస్తారు. రోజూ 5-10 వేల మంది వరకూ దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు కరోనావైరస్ కారణంగా అది సున్నాకు పడిపోయింది’’ అని ఆయన వివరించారు. మార్చి, ఏప్రిల్ నెలలకుగానూ తమకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకూ ఆదాయంలో నష్టం...

సలాం.. షరీఫ్‌ చాచా !

Image
అంతిమయాత్ర రోజున నలుగురు వ్యక్తులు ఉండాలంటారు. మరి నా అంటూ లేనివారికి నేనున్నానంటున్నారు.. ఫైజాబాద్‌కు చెందిన మహ్మమ్మద్ షరీఫ్‌. గత 25 ఏళ్లలో కనీసం 25వేల అనాథ శవాలకు అంతిమ_సంస్కారాలు చేయించారు. ఇందులో హిందూ, ముస్లిం అన్న తేడాను చూపరు. కానీ వారి సంప్రదాయాలను పాటించడాన్ని మరిచిపోరు. ఇంతకూ ఆయన ఓ సైకిల్‌ మెకానిక్‌. పూట గడవడమే కష్టం. 27 ఏళ్లలో 25 వేల మంది అభాగ్యులకు దహనసంస్కారాలు నిర్వహించి వారికి మరణంలోనూ గౌరవాన్ని ప్రసాదించారు. అంతటి గొప్ప మనుసున్న చాచాని గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన నిస్వార్థసేవకు సముచిత గౌరవం కల్పించింది. 28 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత చెలరేగిన మత_ఘర్షణల్లో ఆయన పెద్ద కొడుకు దుర్మరణం పాలయ్యాడు. కానీ, ఆ విషయం నెల తర్వాత గానీ కుటుంబ సభ్యులకు తెలియరాలేదు. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయి అనాథలా తన కుమారుని శవం రైలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసి షరీఫ్‌ చలించిపోయారు. తన కన్న కొడుకుకి పట్టిన గతి ఇంకెవరికీ రాకూడదని అప్పుడే సంకల్పం చేశారు. ఎక్కడ గుర్తు తెలియని మృతదేహాలు కనిపించినా సంప్రదాయబద్ధంగా దహన_సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నార...

కార్మికుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం ఉత్తర్వులు

Image
క‌రోనా గత్తర క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో వివిధ కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య సంస్థ‌లు పనిచేయకున్నా సరే, ఉద్యోగుల‌కు, సిబ్బందికి పూర్తి వేత‌నాలివ్వాలంటూ మార్చి 29నాడు తాను ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్ర‌భుత్వం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలలో హోం శాఖ ఈ విషయం స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద ఇటీవ‌ల‌ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్చి 29 ఉత్తర్వును సవాలు చేస్తూ పలు వ్యాపార సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. చేసిన పనికి పూర్తి జీతాలు చెల్లించాలన్న ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు అన్నింటికీ ఒకే సూచననివ్వడం ఏకపక్షంగానూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ను ఉల్లంఘన అని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా లాక్డౌన్ సమయంలో తమ కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించని ప్రైవేట్ సంస్థలపై ఎటువంటి బలవంతపు చర్యలను ఆశ్రయించవద్దని సుప్రీం కోర్టు మార్చి 15న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, "హోం మంత్రిత్వ ...

‘ఆ డైరీ’లో ఏముంది? ఆమెను ‘దేశద్రోహి’ అని ఎందుకంటున్నారు?

Image
క‌రోనావైర‌స్ విజృంభించిన తొలి నాళ్ల‌లో వుహాన్‌లో రోజువారీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ ప్ర‌ముఖ ర‌చ‌యిత డైరీని ఇప్పుడు ఇంగ్లిష్‌లోని అనువ‌దిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచే వుహాన్‌లో చోటుచేసుకుంటున్న‌ ప‌రిణామాలను, తన అనుభ‌వాల‌ను ఆన్‌లైన్ డైరీగా రాయడం మొద‌లుపెట్టారు 65 ఏళ్ల ఫేంగ్ ఫేంగ్. అప్ప‌టికి క‌రోనావైర‌స్ సంక్షోభం చైనాకు మాత్ర‌మే ప‌రిమితం. ఆమె డైరీ బాగా వైర‌ల్ అయ్యింది. క‌రోనావైర‌స్ పుట్టిన వుహాన్‌లో ఏం జ‌రుగుతుందో చైనాలో ల‌క్ష‌ల మంది తెలుసుకునేందుకు ఇది తోడ్ప‌డింది. క‌రోనావైర‌స్ వ్యాప్తి భ‌యంతో ప్ర‌పంచంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన తొలి న‌గ‌రం వుహాన్‌. అప్పుడు చైనా ప్ర‌ధాన భూభాగంతో పాటు ప్ర‌పంచానికీ ఈ న‌గ‌రంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌కొద్దీ ఫేంగ్ పాపులారిటీ కూడా పెరిగింది. దీంతో ఆమె డైరీలోని సంగ‌తుల‌ను వేరే భాషల్లోకి అనువ‌దిస్తామంటూ ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌లు ముందుకువస్తున్నారు. అయితే, అంత‌ర్జాతీయంగా ఆమెకు వ‌స్తున్న గుర్తింపుపై చైనా గుర్రుగా ఉంది. ఆమె రిపోర్టింగ్‌ను చాలా మంది చైనావాసులు త‌ప్పుప‌డుతున్నారు. కొంద‌రైతే ఆమెను దేశ‌ద్రోహిగా చెబుతున్నారు. ఇ...