Posts

Showing posts from May 3, 2020

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

Image
ఇప్పటికే దారుణ పరిస్థితుల్లో ఉన్న వృత్తులను లాక్ డౌన్ మరింత ప్రమాదంలోకి తోసింది. చేనేత, మరనేత రంగాలు ఇప్పుడు ఇదే ఇబ్బందుల్లో ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల బట్టల వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. లాక్ డౌన్ తరువాత కూడా పాత వేగంతో ముందుకెళుతుందన్న భరోసా లేదు. దీని ప్రభావం నేత కార్మికులపై తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నేత కార్మికులుగా పిలుస్తున్న వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు చేతితో మగ్గంపై నేతనేసే వారు, చేనేత కార్మికులు. రెండోవారు, కరెంటు మెషీన్ల మీద నేతనేసేవారు. వీరినే మరనేత కార్మికులు అంటున్నారు. లాక్ డౌన్ ఇప్పుడు ఇద్దర్నీ ఇబ్బంది పెడుతోంది. పెళ్లిళ్ల సీజన్లు, రెగ్యులర్‌గా వచ్చే ఆర్డర్లు అన్నీ పోయాయి. ఒక అంచనా ప్రకారం ఒక్క తెలంగాణలోనే చేనేత కార్మికుల దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు ఉండిపోయాయి. తెలంగాణలో సగటున నెలకు 40-50 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో సగం పట్టు చీరలే. ఇప్పటి వరకూ నేత కార్మికులు తమ దగ్గర ముడి సరకు ఉన్నంత వరకూ పనిచేశారు. లాక్ డౌన్ వల్ల మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే ముడి సరకు ఆగిపోయింది. దీంతో పని ఆపేయాల్సి వచ్చింద...

విద్యుత్‌ వినియోగదారులకు గడ్డురోజులు రానున్నాయా..?

Image
దేశంలో గృహ విద్యుత్‌ వినియోగదారులకు గడ్డురోజులు రానున్నాయా.. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం -2020 ముసాయిదా బిల్లును పరిశీలిస్తే.. ఈ అనుమానం నిజమేననిపిస్తోందంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి. కేంద్ర ప్రతి పాదించిన విద్యుత్ సవరణ చట్టం-2020 ప్రకారం గృహ వినియోగదారులు తాము వినియోగించే ప్రతి యూనిట్‌కు పూర్తిస్థాయి బిల్లును చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం దయతలిస్తే తప్ప వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుపై సబ్సిడీ లభించే అవకాశం లేదు. తెలంగాణలో ప్రస్తుతమున్న 97.6 లక్షలమంది గృహ వినియోగదారులు తాము వినియోగించే యూనిట్ల ప్రకారం నిర్దేశించిన శ్లాబ్‌ ఆధారంగా లభించే సబ్సిడీని పొందుతూ బిల్లులు చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తున్న వారందరూ సబ్సిడీని పొందుతున్నారు. కానీ కేంద్రం రూపొందించిన బిల్లు అమలులోకి వస్తే ఆ సబ్సిడీలు రద్దయిపోతాయి. విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు, సరఫరా నష్టాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలుపుకొని అయ్యే మొత్తం వ్యయం ఆధారంగా యూనిట్‌ ధరను నిర్ణయిస్తారు. దీంతో ఇప్పటివరకూ సబ్సిడీని...

ఖైదీల తిరుగుబాటు.. కాల్పుల్లో 9 మంది మృతి !

Image
పెరూదేశం లీమా పట్టణం లోని మైగుల్ క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులో 600 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకడం, ఇద్దరు కరోనాతో చనిపోవడంతో జైలు లోని ఖైదీలంతా తమను విడుదల చేయాలంటూ తిరుగుబాటు చేశారు. వీరిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోగా వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కాస్ట్రో కాస్ట్రో జైలు సామర్థ్యం 1,140 మంది ఉండటానికే సరిపోతుంది అయితే ప్రస్థుతం ఆ జైల్లో 5,500 మంది ఖైదీలు ఉన్నారు, అసలే కరోనా వైరస్ తో ప్రపంచం వణుకుతున్న కాలంలో ఇక్కడ కనీసం భౌతిక దూరం పాటించడం కూడా సాధ్యంకాదు. జైలు అధికారులు కూడా ఖైదీలపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఖైదీల బందువులు ఆరోపిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనాతో ఇద్దరు మరణించడం 600 మందికి కరోనా సోకడంతో ఖైదీల్లో తీవ్రంగా ఆందోళనమొదలైంది. తమను విడుదల చేయాలని, రద్దీని తగ్గించాలని, కరోనా సోకకుండా చర్యలు చేపట్టాలని కొద్ది రోజులుగా వాళ్ళు అధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారు. శనివారం(ఏప్రెల్ 25) నాడు దాదాపు రెండు వందల మంది ఖైదీలు నిరసన ప్రదర్శన కూడా చేశారు. దయచేసి మమ్ములను కరోనాతో చంపకండి...మమ్మల్ని కాపాడండి అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఆ రోజు...

తెలంగాణలో కరోనా లెక్కలు గజిబిజి : హైకోర్టు

Image
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షల తీరుతెన్నులపై రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం అనుమానితులకే పరీక్షలు ఎందుకు చేస్తున్నారని, అందరికీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి స్థాయి పరీక్షలు చేయకపోతే కరోనా వ్యాప్తికి సంబంధించిన వాస్తవాలు తెలియవని హైకోర్టు కామెంట్ చేసింది. ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే పరీక్షలు చేస్తున్నామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్ష చేయాలని WHO మార్గదర్శకాల్లో ఎక్కడుందో చూపించాలని ప్రశ్నించింది కోర్టు. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు ఎందుకు చేయడం లేదో వివరించాలని స్పష్టం చేసింది. గజిబిజి లెక్కలతో ప్రజలకు వాస్తవాలు తెలియని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేసింది. ---------------------------------------------------------------------- ...

కార్మిక చట్టాలను రద్దు చేసిన‌ కాషాయ ప్రభుత్వం

Image
కరోనా లాక్ డౌన్ సాకుతో ఉత్తరప్రదేశ్ యోగీ ప్రభుత్వం కార్మికులను ఏ హక్కులూ లేని భానిసలుగా మార్చాలని కుట్ర పన్నింది. పెట్టు బడిదారులకు అధిక‌ లాభాలు, కార్మికులకు అన్యాయమైన పని పరిస్థితులూ ఉండే విధంగా కొత్త ఆర్డినెన్స్ తీసుకవచ్చింది. వచ్చే మూడు సంవత్సరాలకు దాదాపు అన్ని కార్మిక చట్టాల పరిధి నుండి వ్యాపారాలకు, పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చే ఆర్డినెన్స్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రపతి అంగీకారం పొందిన తర్వాతే ఆర్డినెన్స్ చట్టంగా మారుతుంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. COVID-19 వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, మందగించాయి. జాతీయ లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు మరియు ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ దెబ్బ తిన్నాయి. కొన్ని పూర్తిగా ఆగిపోయాయి ʹʹ అని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలిపింది. అన్ని సంస్థలు, కర్మాగారాలు మరియు వ్యాపారాలను కార్మిక చట్టాల‌ పరిధి నుండి మినహాయించటానికి ప్రభుత్వం కార్మిక చట్టాల ఆర్డినెన్స్ 2020 ని తీసుకవచ్చింది. అయితే భ...

వలస జీవులను దోచుకున్న బీజెపి నేత.. ప్రశ్నించినందుకు దాడి

Image
అసలే లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను ఓ బీజేపీ నాయకుడు నిలువుదోపిడీ చేశాడు. పైగా ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఓ కార్మికుడిని రక్తం కారేట్టు తీవ్రంగా కొట్టాడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. గుజరాత్ లోని సూరత్ లో రెండు నెలలుగా చిక్కుకపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు తమ స్వంత ఊర్లకు పోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఈ లోపు వలస కార్మికులు తమ స్వంత ఊర్లకు వెళ్ళడానికి ప్రభుత్వం రైళ్ళను నడిపే నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వలస కార్మికులకు సహకరించడం కోసం సూరత్ బీజేపీ శాఖ రాజేష్‌ వర్మ అనే బీజేపీ నాయకుడికి బాధ్యతలు అప్పజెప్పింది. ఇక ఆయన ఆయన అనుచరులు కలిసి దోపిడికి తెరలేపారు. టిక్కట్లకు డబ్బుల పేరుతో 750 రూపాయల టిక్కట్టుకు ఒక్కొక్కరి దగ్గర 2 వేలు వసూలు చేశారు. అలా 1లక్షా 40 వేల రూపాయలు వసూలు చేశాడు బీజేపీ నాయకుడు రాజేష్ వర్మ. మరో వైపు ప్రభుత్వం వలస కార్మికులు రైళ్ళలో ఫ్రీగానే ప్రయాణించవచ్చని ప్రకటింది. ఈ నేపథ్యంలో వాసుదేవ వర్మ అనే వలస కార్మికుడు లింబాయత్ ప్రాంతంలోని రాజేష్ వర్మ‌ కార్యాలయానికి వెళ్ళి డబ్బుల వసూలు విషయంపై రాజేష్ వర్మను ప్రశ్నించాడు...

వలసజీవుల విషాదాంతం

Image
వలస కార్మికుల ప్రాణాలు పోతున్నాయి....ఆకలితో లేదా ప్రయాణంతో.... వలస కార్మికుల కోసం రైళ్ళు నడుపుతున్నామని ప్రభుత్వాలు చెబుతున్న మాటల్లో డొల్లతనం బైటపెడుతున్నాయి వలస కార్మికుల మరణాలు. దేసవ్యాప్తంగా ఉన్న కోట్లాడి మంది వలస కార్మికుల కోసం...ఏదో పేరుకు నడుపుతున్న రైళ్ళు సరిపోవన్న విషయం ప్రభుత్వాలకూ తెలుసు. రైళ్ళు నడుపుతున్నామని ప్రభుత్వాలు మాటలు చెబుతున్న సమయంలోనే... వేలాది కిలోమీటర్లు నడిచివెళ్తున్న కార్మికులు... రైలు పట్టాలపై ప్రాణాలు పోగొట్టుకున్న 16 మంది కార్మికులు...పాలకుల మాటల్లోని డొల్లతనాన్ని వెక్కిరిస్తున్నాయి. సైకిల్ మీద బయలు దేరిన ఓ కార్మికుడి కుటుంభాన్ని వాహనం గుద్దడంతో భార్య భర్తలు ప్రాణాలు కోల్పోయి ఇద్దరు చిన్నారులు చావుతో పోరాడుతున్న సంఘటన ఈ దేశపు దుర్మార్గపు పాలకుల నీతిని ఎండగడుతోంది. చత్తీస్ గడ్ కు చెందిన కృష్ణ‌, అత‌ని భార్య ప్ర‌మీల ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని ల‌క్నో‌కు వ‌ల‌స వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడ‌లో నివ‌సిస్తున్నారు. వీరికి నాలుగేండ్ల కూతురు చాందినితోపాటు మూడేండ్ల కొడుకు నిఖిల్ ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చేయడానికి పని లేదు...తినడానికి తిండి లే...

సీఎం డ్రైవర్ కి కరోనా పాజిటివ్

Image
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ తరుణంలోనే దేశంలోని పలు ముఖ్యమంత్రులు కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది ..దానికి తగ్గ ప్రణాళికలతో మనం ముందుకుపోవాలని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారి మాటలు అక్షర సత్యమైయ్యేలా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ చాలా పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా భాదితులు రోజు గుంపులు గుంపులుగా బయటపడుతున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా భాదితుల సంఖ్య 46 వేలు దాటిపోయింది. కాగా తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా కలకలం రేపుతోంది. అశోక్ గెహ్లాట్ ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి వైరస్ బారిన పడ్డాడు. దీంతో అధికారులు అప్రత్తమయ్యారు. జైపూర్ బజాజ్ నగర్ కు చెందిన 59 ఏళ్ల వయసున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందే అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు సెలవుపై ఇంటికి పంపించారు. మరోవైపు అతడు నివసించే జైపూర్లోని బజాజ్ నగర్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. అతడు ఎవరెవరిని కలిశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు రాజస్థాన్ లో 3061 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 77 మంది చనిపోయారు....

ఇకపై మద్యం హోం డెలివరి ?

Image
లాక్‌డౌన్ సడలింపులతో మద్యం దుకాణాలను తెరిచిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మద్యాన్ని నేరుగా ఇంటికే డెలివరీ చేయాలని పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నేటి నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు పంజాబ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ శాఖ తెలిపింది. ఎంత సమయంలో మద్యాన్ని డెలివరీ చేస్తారనే విషయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. అలాగే, ఇంటికి రెండు లీటర్లకు మించి మద్యాన్ని డెలివరీ చేయబోమని తెలిపింది. పశ్చిమ బెంగాల్ కూడా ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. 21 ఏళ్లు దాటిన వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ సైట్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నారు. -------------------------------------------------------------- The state governments, which opened liquor stores with lockdown easing, have now made another sensat...

గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో 16 మంది వలస కూలీల మృతి

Image
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ గూడ్స్ ట్రైన్‌ దూసుకెళ్లడంతో 16 మంది వలస కూలీలు మరణించారు. "ఇప్పటివరకు 16 మంది కూలీలు మృతి చెందినట్లు గుర్తించాం. మరో ఐదుగురిని ఔరంగాబాద్ హాస్పటల్‌కు తరలించాం" అని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో బీబీసీకి తెలిపారు. వాళ్లంతా బహుశా రైలు వస్తున్న సమయంలో పట్టాలపై నిద్రిస్తూ ఉండొచ్చని ఆయన అన్నారు. ఈ ఘటన ఉదయం 5.30 గంటల సమయంలో జరిగింది. ఈ కార్మికులంతా ఔరంగాబాద్ సమీపంలోని జాల్నాలో ఉన్న ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారని ఔరంగాబాద్ ఎస్పీ మోక్షద పాటిల్ బీబీసీకి తెలిపారు. "వీళ్లంతా భుసావల్ వైపు వెళ్తున్నారు. భుసావల్ నుంచి వలస కూలీలకు ఓ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని వాళ్లకు ఎవరో చెప్పారు. అందుకే వాళ్లంతా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు" అని ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారని, నలుగురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని ఆమె తెలిపారు ఈ కూలీలంతా మధ్య ప్రదేశ్‌కు చెందినవారుగా భావిస్తున్నారు. ఔరంగాబాద్ సమీపంలోని కర్మాద్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 16మంది వలస కూలీల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు....

మరోసారి గ్యాస్ లీకేజీ.. రోడ్లపైకొచ్చిన ప్రజలు

Image
విశాఖ నగరంలో గ్యాస్ లీకేజీ ఆందోళన, భయం రాత్రి కూడా కొనసాగాయి. ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం రావడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలవైపు పరుగులు తీశారు. గురువారం రాత్రి కూడా ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ విడుదల కావడాన్ని గుర్తించిన స్థానిక అధికారులు వేపగుంట, నాయుడుతోట, కంపెనీ సమీప గ్రామాలను ఖాళీ చేయించారు. అయితే, గ్యాస్ లీక్ ఏమీ లేదని, ముందు జాగ్రత్తగా 4 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించామని డీజీపీ స్పష్టం చేశారు. న్యూట్రలైజర్ కెమికల్‌తో ఎల్జీ పాలిమర్స్ దగ్గరకు చేరుకున్న బృందం తమ పని మొదలుపెట్టే ముందు సమీపం గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించాల్సిందిగా సూచించింది. లీకేజీ ఏమీ లేదని, ఉదయం లీకైన ఛాంబర్ నుంచి అందులో మిగిలిపోయిన గ్యాస్ బయటకు వస్తోందని డీజీపీ వెల్లడించారు. విశాఖపట్నంలో బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాత నగర్ తదితర ప్రాంతాల ప్రజలంతా ఇళ్లు వదిలి నగరం వైపు వచ్చారు. ఎల్జీ పాలిమర్స్ పేలిపోతుందనే ప్రచారం కొనసాగటంతో చాలామంది ఇళ్లను వదిలి దూరంగా, బయటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతతో ...

ఇంధన ధరల పెంపులో మనమే ప్రపంచంలో No. 1

Image
ప్రపంచంలోనే పెట్రోల్,డీజిల్ పై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. గత రాత్రి కేంద్రప్రభుత్వం పెట్రోల్ పై రూ.10,డీజిల్ రూ.13 ఎక్పైజ్ సుంకాన్ని పెంచడంతో ప్రపంచంలో ఆయిల్ ధరలపై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ఫ్యూయల్ రీటైల్ ధరపై ఫ్రాన్స్,జర్మనీ దేశాల్లో ట్యాక్స్ 63శాతం ఉండగా,ఇటలీలో 64శాతం,బ్రిటన్ లో 62శాతం,స్పెయిన్ లో 53శాతం,జపాన్ లో 47శాతం,కెనడాలో 33శాతం,అమెరికాలో కేవలం 19శాతం మాత్రమే ఉన్నాయి. గతేడాది వరకు భారత్ లో పెట్రోల్,డీజిల్ రెండింటి రీటైల్ ధరపై 50శాతం వరకు ట్యాక్స్ లు ఉండేవి. అయితే ప్రస్తుతం 69శాతంతో వరల్డ్ నెం.1గా భారత్ నిలిచింది. మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాలు వరుసగా ఆయిల్ ధరలపై ట్యాక్స్ లను పెంచుతున్నాయి. సోమవారం ఢిల్లీ సర్కార్.. పెట్రోల్‌,డీజిల్‌ ధరలపై ముప్పై శాతం వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (Vat)‌ను పెంచింది. కాగా, ఇప్పటికే గత నెలలో అసోం రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ పెంచింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. పెట్రోల్ పై VATను లీటర్ పై 2రూపాయలు,డీజిల్ పై 1రూపాయిని పెంచినట్లు ఉత్తరప్ర...

ఇప్పుడు చిన్నారుల్లో మరో అంతుచిక్కని కొత్త రోగం..?

Image
కరోనా పుణ్యమా అని న్యూయార్కు మహానగరం ఎంతలా అతలాకుతలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కాటుతో ఈ నగరంలోని ప్రజలు విలవిలలాడిపోయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ నగరంలోని చిన్నారులు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొటున్నారు. వీరంతా కరోనా పాజిటివ్ గా తేలిన వారే. అంతు చిక్కని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న చిన్నారులంతా రెండు నుంచి పదిహేనేళ్ల లోపు వారే. న్యూయార్క్ చిన్నారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్ని వైద్యులు మిస్టీరియస్ సిండ్రోమ్ గా అభివర్ణిస్తున్నారు. ఈ చిన్నారుల ధమనులు సహా రక్తనాళాల్లో వాపుతో పాటు పొత్తికడుపులో నొప్పి.. వాంతులు వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. న్యూయార్క్ లో తాజాగా బయట పడిన ఇలాంటి లక్షణాలు అంతకు ముందు పలు యూరోపియన్ దేశాల్లోనూ ఇదే తరహా కేసులు బయటకు వచ్చాయి. ఇది కొవిడ్ తో సంబంధం ఉన్న వ్యాధిగానే భావిస్తున్నారు. ఫ్రాన్స్.. ఇటలీ.. స్పెయిన్.. స్విట్జర్లాండ్.. బెల్జియం దేశాల్లోని పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే.. దీనికి కారణం ఏమిటన్న విషయాన్ని మాత్రం వైద్యులు తేల్చలేకపోతున్నారు.కాకుంటే.. అంతుచిక్కని ఈ రోగాల్ని ఎదుర్క...

ఆధార్ ఉంటేనే మందు !

Image
రెడ్ జోన్ల నుంచి కొందరు ఇతర జోన్లకు మద్యం కోసం వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనను తెచ్చింది. సదరు కొనుగోలుదారు తన ఆధార్ కార్డును చూపిస్తేనే మద్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. రెడ్ జోన్లు, కంటైన్ మెంట్ క్లస్టర్ల పరిధిలో మద్యం దుకాణాలు తెరవకపోవడంతో, ఆ ప్రాంతాల నుంచి బయటకు వస్తున్న వారు, మద్యం కోసం క్యూ లైన్లలోకి వస్తున్నారని, ఈ కారణంగానే ఆధార్ కార్డును పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు వెల్లడించారు. ముఖానికి మాస్క్, గొడుగులు ధరించి మాత్రమే మద్యం కోసం రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో మొత్తం 3,463 వైన్స్ దుకాణాలుండగా, బుధవారం 2,330 మాత్రమే తెరచుకున్నాయి. 663 దుకాణాలను కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో ఉన్న కారణంగాను, ప్రజల ఆందోళనలతో 16 షాపులను, టెక్నికల్ కారణాలతో 18 షాపులను, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్న అనుమానాలతో 69 షాపులను అధికారులు తెరవనివ్వలేదు. ఇతర కారణాలతో మరో 284 షాపులు కూడా తెరచుకోలేదు. విక్రయానికి తగినంత స్టాకు లేని కారణంగా 83 షాపులు తెరచుకోలేదు. ఇక తొలి రెండు రోజులతో పోలిస్తే బుధవారం వైన్స్ షాపుల వ...

పుకార్ల సృష్టికర్తలు 7 రకాలు !

Image
కరోనావైరస్ గురించి కుట్ర సిద్ధాంతాలు, వదంతులు, ఊహాగానాలు.. సోషల్ మీడియాలో వరదలా ప్రవహిస్తున్నాయి. అసలు ఈ వదంతులను మొదలుపెట్టేది ఎవరు? వాటిని వ్యాపింపజేసేది ఎవరు? ఈ మహమ్మారి కాలంలో తప్పుదోవ పట్టించే వందలాది కథనాల మీద మేం దర్యాప్తు చేశాం. దానివల్ల.. ఈ తప్పుడు సమాచారం వెనుక ఎవరు ఉన్నారనే దాని గురించి ఒక అవగాహన వచ్చింది. ఈ పుకార్లు పుట్టించి, ప్రచారం చేసే ఏడు రకాల మనుషులు వీరే: లండన్ వాసులకు తినిపించటం కోసం ప్రభుత్వం వెంబ్లీ స్టేడియంలో ఓ భారీ కుండలో వంట చేస్తోందని ఒక వాట్సాప్ వాయిస్ సందేశం వచ్చినపుడు అది జోక్ అని కొంత మందికి అర్థం కాలేదు. ఇంకాస్త సీరియస్ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక వ్యక్తి ప్రభుత్వం నుంచి వచ్చిన టెక్ట్స్ మెసేజ్ అంటూ ఒక స్క్రీన్‌షాట్ తయారు చేశాడు. ఈ సందేశం అందుకున్న వ్యక్తి.. ఇంటి నుంచి చాలా సార్లు బయటకు వెళ్లినందుకు జరిమానా విధించామన్నది ఆ టెక్ట్స్ మెసేజ్ సారాంశం. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిని భయపెట్టటం సరదాగా ఉంటుందని అతడు అనుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫాలోవర్లు దానిని షేర్ చేశాక, అది స్థానిక ఫేస్‌బుక్ గ్రూపుల్లోకి చేరింది. ఆందోళన చెందిన స్థానిక జనం దాన...

ఒక్క నెలలోనే 12.2 కోట్ల మంది ఉద్యోగం పోయింది..

Image
భారత్‌లో దేశ వ్యాప్తంగా విధించిన కరోనావైరస్ లాక్ డౌన్‌తో ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఒక ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన అంచనాల ప్రకారం భారత్‌లో నిరుద్యోగ రేటు 27.1 శాతంగా నమోదైంది. ఈ డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అమెరికా కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంది. నిరుద్యోగం గురించి భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. కానీ సీఎంఐఈ విడుదల చేసిన వివరాలను ఆమోదయోగ్యమైన సమాచారంగా పరిగణిస్తారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్లని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు భారీ సంఖ్యలో 'లే ఆఫ్' అమలు చేశాయి. దేశంలో మే 6 నాటికి సుమారు 49000 మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. మార్చి నెలలో 8.7 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఏప్రిల్ నాటికి 23.5 శాతానికి చేరింది. ఈ పరిస్థితికి లాక్ డౌన్ కారణమని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలైన హాస్పిటళ్లు, మందుల షాపులు, నిత్యావసర సరకులు అమ్మే దుకాణాలు తప్ప మరేవీ పని చేయలేదు. కొన్...

8 మందిని బలిగొన్న పరిశ్రమ.. వెంటిలేటర్ పై 85 మంది

Image
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఓ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి రసాయన వాయువులు భారీగా లీకవుతున్నాయి. గురువారం వేకువ నుంచి రసాయన వాయువులు లీకవవుతుండడంతో ఇప్పటికే మూణ్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. 86మంది బాధితులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు. విశాఖలో ఇదే పెద్ద ప్రమాదం పారిశ్రామిక నగరం విశాఖలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. అందులో 2013 జనవరి 27న జరిగిన ప్రమాదం పెద్దది. అప్పట్లో ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హెచ్‌పీసీఎల్‌ ఎంఎస్ బ్లాక్‌లో సీసీఆర్ యూనిట్‌లో ఆ ప్రమాదం సంభవించింది. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1997లో కూడా హెచ్‌పీసీఎల్‌లోనే ప్రమాదం జరిగింది. 22 మంది మరణించారు. 2013, 2017లో కూడా ప్రమాదాలు జరిగినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం లేకుండా బయటపడ్డారు. వాటి తర్వాత ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదమే విశాఖ పారిశ్రామికప్రాంతాల్లో జరిగిన పెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. విశాఖ దుర్ఘటన హృదయవిద...