Posts

Showing posts from April 12, 2020

9/11 మూడో టవర్ అలా కూలలేదట!

Image
తేది : 11-09-2001 తారీఖును ప్రపంచం మొత్తం మరిచిపోయినా.. అమెరికా మాత్రం మరువలేదు. ఎందుకంటే, ఆ తారీఖునే ట్విన్ టవర్స్ ను ఉగ్రవాదులు కూల్చేశారు కాబట్టి! కానీ ప్రపంచానికి తెలియని విషయమేమిటంటే ఆ రెండు టవర్లతోపాటు మరో టవర్ కూడా కూలిందని విషయం! అయితే ఈ మూడో టవర్ మంట వల్ల కూలలేదని ఓ అమెరికన్ యూనివర్సిటీయే తన పరిశోధనలో వెల్లడించింది. ఏ యూనివర్సిటీ, పరిశోధన ఎప్పుడు చేసింది? అమెరికాలోని University of Alaska Fairbanks లో, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన, పీ హెచ్డీ విద్యార్థులు ఈ పరిశోధన చేశారు. మొత్తం నాలుగు సంవత్సరాల పాటు, బిల్డింగ్ కి సంబంధించిన అన్ని డీటైల్స్ నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కంప్యూటర్ సిములేషన్ టెక్నాలజీ ఆధారంగా వివిధ రకాల డెమాలిషన్ మాడల్స్ తో క్రాస్ చెక్ చేసుకుని, పరిశోధనా ఫలితాల్ని గతనెలలో రిలీజ్ చేశారు. (Link from university website - http://ine.uaf.edu/wtc7 ) మొత్తానికి ఏం తీర్మానించారు? అమెరికన్ ప్రభుత్వం చెప్తున్నట్లు, ఈ కూలిపోవడం అనేది మంటవల్ల అయ్యుండే అవకాశం ఏ మాత్రం లేదు, అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ********** 9/1...

మస్జిదులో విరిసిన మతసామరస్యం..

Image
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడులోని నూజివీడు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జి కింద 15 మంది సాధువులు మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బంది పడుతుంటే అదే ప్రాంతంలో ఉన్న మసీద్ దగ్గర ముస్లిమ్స్ భోజనం ఏర్పాటు చేశారు మొగల్ మస్తాన్ గారు మొగల్ సాయి గారు మొగల్ ఖాదర్ భాష గారు మొగల్ హుస్సేన్ గారు ఏర్పాటు చేశారు మే 3 తారీకు వరకు ఇది కొనసాగాలని ఇన్షా అల్లా

కరోనా వ్యాప్తి కారణాలు.. ఎంపీ రేవంత్ సూచనలు..

Image
భావోద్వేగాలు చల్లారిన తర్వాత వాస్తవాలు ఎరుకకు వస్తాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటప్పుడే మేథావులు, బుద్ధిజీవులు చొరవ చూపాలి. భావోద్వేగపు అగ్నిగుండం నుండి నిప్పుకణికల్లాంటి నిజాలను వేరు చేసి ప్రజల ముందు ఉంచాలి. పాలకులు తీయ్యటి మాటలతో సామాన్యుడిని ఊహాప్రపంచంలో విహరింప జేస్తున్నప్పుడు ఆ ఊహాను చెదరగొట్టి వాస్తవంలోకి తీసుకురావడం అవసరం. కొంత కఠినమే కావచ్చు. కానీ, అది ఊహ... ఇదిగో ఇదీ వాస్తవం అని చెప్పడమే సమాజహితులు చేయాల్సిన పని. ఊహ చెదిరినప్పుడు కలిగే నిరుత్సాహం తాత్కాలికం. నిజం చేసే మేలు శాశ్వతం. అందుకే... ఈ వ్యాసం రాయాలని సంకల్పించాను. ప్రపంచం కరోనా గుప్పిట్లో చిక్కి వంద రోజులు దాటింది. వైరస్ అంతం ఎప్పుడు అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ విపత్తు మనిషికి అనేక పాఠాలు నేర్పింది. దేశాలు గుణపాఠాలు నేర్చుకున్నాయి. ముందుగా మేల్కొన్న దేశాలు కొంత భద్రంగా ఉన్నాయి. నిర్లక్ష్యం చేసిన దేశాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇందులో మనదేశం ఎటువైపు ఉంది? కరోనా కార్యచరణలో ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? వైరస్ కు ముందు – తర్వాత మన దేశంలో ఏం జరిగింది... ఏం జరగబోతోంది? మలి దశ లాక్ డౌన్ ముంగిట నిక...

అమాయకుడిపై అభాండం.. ఇదంతా మీడియా నిర్వాకం..!

Image
దేశంలో ఎవరికీ కరోనా పాజిటివ్ వచ్చినా.. అది ముస్లింల వల్లే వచ్చిందనేలా అబద్ధాలను వండి వార్చుతున్న మీడియా కారణంగా ఓ పేదవాడు శల్య పరీక్షకు సిద్దపడాల్సి వచ్చింది. ఎక్కడో మహమ్మారిని తగిలించుకొని వచ్చిన ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చెందిన ఓ ధనిక కుటుంబం.. తమ దగ్గర పనిచేసే ఓ బీద సెక్యూరిటీ గార్డ్ వల్లే తమకు కరోనా సోకిందని ఆరోపించి, ఆ పేదవాడిపై లేనిపోని అభాండాలు మోపింది. కానీ, చివరగా ఆ సెక్యూరిటీ గార్డ్ రిపోర్టులు నెగెటివ్ రావడంతో బలిసిన కుటుంబం కావాలనే ఆ పేద ముస్లింను బద్నామ్ చేసిందని తేలింది. అసలు సంగతేమిటంటే.. సదరు ధనిక కుటుంబంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందుకు తమ సెక్యూరిటీ గార్డే కారణమని ఆ కుటుంబం ఆరోపించింది. పైగా, ఆ గార్డ్ ముస్లిం కావడంతో.. ఆ ధనికులు గార్డ్ కిందటి నెలలో మర్కజ్ కు వెళ్లాడని, కొన్ని రోజులు అక్కడే ఉంది వచ్చాడని కూడా పోలీసులకు తెలిపారు. గార్డ్ మాత్రం తాను మర్కజ్ పోలేదనీ, అక్కడికి కొంత దూరంలో ఉన్న మస్జీద్ వెళ్లి, నమాజ్ చేసుకొని తిరిగి వచ్చానని ఎంతలా మోతుకుకున్నా, పోలీసులు ఈ విషయాన్ని ఏమాత్రం వినకుండా, కేవలం ధనికులకే వత్తాసు పలికారు. దీంతో సదరు గార్డ...

మనదేశంలో మహమ్మారి అడ్డాలివే..!

Image
రాష్ట్రాల వారీగా కేంద్రం విడుదల చేసిన కరోనా హాట్ స్పాట్స్ వివరాలు.. ఆంధ్రప్రదేశ్:- కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, వైయస్ఆర్, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, మరియు అనంతపురం. బీహార్:- గయా, బెగుసారై, ముంగేర్, సివాన్ చండీగఢ్ :- చండీగఢ్ ఛత్తీస్‌గఢ్ :- రాయ్‌పూర్, కోర్బా ఢిల్లీ :- నార్త్ వెస్ట్, సౌత్ ఢిల్లీ, షాహదారా, సౌత్ ఈస్ట్, వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీ గుజరాత్:- పటాన్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, భావ్‌నగర్, రాజ్‌కోట్ హర్యానా:- అంబాలా, కర్నాల్, నుహ్, గుర్గావ్, ఫరీదాబాద్, పాల్వాల్ జమ్మూ కాశ్మీర్:- షోపియన్, రాజౌరి, శ్రీనగర్, బండిపోరా, బారాముల్లా, జమ్మూ, ఉధంపూర్, కుప్వారా కర్ణాటక:- దక్షిణ కన్నడ, బీదర్, కల్బుర్గి, బాగల్‌కోట్, ధార్వాడ్, బెంగళూరు అర్బన్, మైసూరు, బేలగవి కేరళ:- వయనాడ్, కాసర్గోడ్, కన్నూర్, ఎర్నాకుళం, మలప్పురం, తిరువనంతపురం, పతనమిట్ట మధ్యప్రదేశ్:- మోరెనా, ఇండోర్, భోపాల్, ఖార్గోన్, ఉజ్జయిని, హోసంగాబాద్ మహారాష్ట్...

ప్రభుత్వం చెబుతున్న కరోనా లెక్కల్లో నిజమెంత ?

Image
"తెలంగాణలో 700 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.. వాటిలో 640 పైగా కేసులకు ఢిల్లీ మర్కజ్ తో లింక్ ఉంది.. మర్కజ్ వెళ్లొచ్చిన ఇంకా చాలా మంది బయటనే ఉన్నారు.." అనేవి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న లెక్కలు! ఈ లెక్కలతో కేవలం ముస్లింల వల్లే కరోనా వ్యాపించిందని ప్రభుత్వం చెప్పకనే చెబుతోందన్నమాట! సాక్షాత్ ఓ మంత్రిగారే దీన్ని ద్రువీకరించేలా మాట్లాడటంతో కొంతమంది మతమౌఢ్యులు ముస్లింలనే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా లెక్కలను వ్యతిరేకిస్తూ కూడా కొన్ని ప్రశ్నలతో కూడిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రశ్నలు న్యాయబద్ధంగా ఉండటంతో.. వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని ముస్లిం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవే ఆ ప్రశ్నలు..  1. మర్కజ్ సమావేశం మార్చి 13న జరిగింది. మార్చి 18, 19 నాటికి మర్కజ్ వెళ్ళిన వారు చాలా మంది వెనక్కు వచ్చేశారు. నెలరోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు టెస్టులు చేయించుకోకుండా బయటే ఉన్నారని మంత్రి గారు చెబుతున్న వారికి రోగ లక్షణాలు బయటపడలేదా? 2. అలా మర్కజ్ నుంచి వచ్చిన వారి సెకండరీ కాంటాక...

చిన్నారిని రేప్ చేసిన బీజేపీ నాయకుడు.. అరెస్టులో జాప్యం చేసిన పోలీసులు..

Image
అతడు ఓ ఉపాధ్యాయుడు.. కానీ స్థానిక బీజేపీ నాయకుడు.. కాబట్టి ఈ కామాంధుడు ఓ చిన్నారిని అత్యాచారం చేసినా ఇతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులకు నెల పట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని కన్నూరులో టీచరుగా పనిచేసే పద్మరాజన్ బిజెపి త్రిప్పంగోటూర్ స్థానిక కమిటీ అధ్యక్షుడు కూడా! ఇతడు తన పాఠశాలలోనే చదివే నాలుగో తరగతి విద్యార్థినిపై జనవరి, ఫిబ్రవరి నెలల్లో అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాధిత చిన్నారి ద్వారా తెలుసుకొని మార్చి 17న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసే ధైర్యం చేయలేదు. ఇతను స్థానిక బీజేపీ నాయకుడు కావడమే కారణమని, అందుకే పోలీసులు అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిపిఐ (ఎం) నాయకులూ, ఆరోగ్య, సామాజిక న్యాయం, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కె.కె.శైలజ ఎన్ని ఆరోపణలు చేసినా పోలీసులు మాత్రం నిందితుడు పద్మరాజన్ అరెస్ట్ విషయంలో చొరవ తీసుకోలేదు. ఇదిలా ఉంటే అదనపు పాఠాలు చెప్పాలని తనను పాఠశాలకు పిలిచి, ఆ తర్వాత టాయిలెట్ లోకి తీ...

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

Image
లాక్ డౌన్ నేపథ్యంలో ఓ పంజాబీ భార్యాభర్తలు కలిసి రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ నవ్వులను పంచుతోంది..!

కులమతాలకతీతంగా మస్జిదులో రోజూ 800 మందికి అన్నదానం

Image
కరోనా పేరిట కొంతమంది వారిని ఎన్ని విధాలుగా వివక్షకు గురిచేస్తున్నా.. వారు మాత్రం తమ ఆచరణలో మానవత్వాన్ని ప్రదర్శిస్తూ కోట్ల మంది హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా గణాంకాల ప్రకారం ప్రస్తుత కరోనా సహాయక చర్యల్లో ముస్లింల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉందని తేలడం గమనార్హం! ఈ నిజాలకు ముంబై ముస్లింలు సాక్ష్యంలా నిలుస్తున్నారు. ముంబైలోని సాకినాక ప్రాంతంలోని ఒక మసీదు ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 800 మంది నిరుద్యోగ కార్మికులకు మసీదు ప్రాంగణంలోనే కులమతాలకతీతంగా రోజూ అన్నదానం చేస్తూ అక్కడి ముస్లింలు ఆదర్శ0గా నిలుస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ మసీదు చుట్టుపక్కల ప్రజలకు ప్రతిరోజూ రేషన్ కూడా అందించబడుతుంది.  సహాయక చర్యల్లో నిమగ్నమైన మసీదు బృంద సభ్యులు మౌలానా సనబాలి మాట్లాడుతూ కోవిడ్ -19 మాదిరిగా ఆకలి కూడా మతానికి అతీతమైనదని, ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుందన్నారు. అందుకే తమ వంతుగా ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఆహారం పంపిణీ సమయంలో కరోనా సంక్రమణ ప్రమాదం గురించి వారిని అ...

నవజాత శిశువు ప్రాణాలు తీసిన వైద్యుల మతవివక్ష

Image
ఓ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రదర్శిన మతవివక్ష ఇంకా కళ్లు కూడా తెరవని నవజాత శిశువు ప్రాణాలు తీసింది. ఈ విద్వేషపూరిత దుర్ఘటన రాజస్థాన్ రాష్టంలోని భరత్పూర్ జిల్లా కేంద్రంలో జరిగింది. చనిపోయిన బిడ్డ తండ్రి, బాధితుడైన ఇర్ఫాన్ ఖాన్ ప్రకారం భరత్పూర్ జిల్లా, సిక్రి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లామని సూచించడంతో ఇర్ఫాన్ తన భార్యను భరత్పూర్ జిల్లా జనానా ఆసుపత్రికి తరలించాడు.  కానీ, జిల్లా ఆసుపత్రి వైద్యుడైన మోనిత్ వాలియా కేవలం గర్భవతి ముస్లిం కాబట్టి తమ హాస్పిటల్లో చేర్చుకోమని, ఇక్కడ వైద్యం చేయడం కుదరదని చెప్పి.. జైపూర్ తరలించామని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడని ఇర్ఫాన్ తెలిపాడు. దీంతో గతిలేక ఇర్ఫాన్ అంబులెన్సులో తన భార్యను ఎక్కించగానే, ఆమెకు నొప్పులు ఎక్కువై అంబులెన్సులోనే ప్రసవించింది. కానీ, ఈపాటికే ఆలస్యం కావడంతో అప్పుడే పుట్టిన శిశువు ప్రాణాలు వదిలింది. తన బిడ్డ చనిపోవడానికి జిల్లా ఆసుపత్రి వైద్యుడు మోనిత్ వాలియా నిర్లక్ష్య...

తప్పుడు పోస్టులు పెట్టిన తప్పుడు నాయకుడి అరెస్ట్

Image
కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమని సోషల్ మీడియాలో అసత్య పోస్టులు చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నాయకున్ని అక్కడి పోలీసులు ఏప్రిల్ 4న దేవానంద్ దేవరాజ్ అనే బీజేపీ నాయకుడు ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. వాటిని చదివిన ఇక్బాల్ సిద్దిఖీ అనే యువకుడి ద్వారా ఈ విషయం కొల్హుయ్ ఏరియా పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ సైబర్ సెల్ తో దర్యాప్తు చేసి ముస్లింల పట్ల విషం వెదజల్లుతున్న పోస్టులను చూశారు. తరువాత ఏప్రిల్ 5న ఆ అధికార పార్టీ దుండగున్ని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సోషల్ మీడియా ద్వారా అతను ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. మహారాజగంజ్ ఎస్పీ విచారణ జరిపి దేవానంద్ దేవరాజ్ దృష్టికి ఈ సంఘటన చేరడంతో ఆయన సూచనా మేరకు నిందితుడు దేవానంద్ దేవరాజ్ ను అరెస్ట్ చేసి ను జైలుకు పంపామని కొల్హుయ్ ప్రాంత ఎస్‌ఓ రామ్‌సాహయ్ చౌహాన్ చెప్పారు. ఈ సందర్బంగా ఎస్ఓ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు త...

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

Image
వార్తలను ప్రసారం చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న జాతీయ మీడియా సంస్థ 'ఏబీపీ న్యూస్ ఛానల్' ఇప్పుడు కేవలం ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ.. ప్రజావ్యతిరేక వార్తలను, జనాల్లో విద్వేషాలను పెంచిపోషించే సమాచారాన్ని ప్రసారం చేస్తూ తన చరిత్రకు తానే మచ్చ తెచ్చుకుంటోంది. ఇందుకు మొన్న బాంద్రా రైల్వే స్టేషన్ సంఘటనే ఉదాహరణ ! అసలు విషయమేమిటంటే.. కొన్ని రోజుల కిందట "ఏబీపీ మాఝా" అనే మరాఠీ న్యూస్ ఛానెల్లో " ఏప్రిల్ 14వ తేదీ నుంచి లాక్ డౌన్ వల్ల ముంబైలో ఇరుక్కున్న ఇతర ప్రాంతాల ప్రజలను వారి వారి స్వస్థలాలకు చేర్చాలనే ఉద్దేశ్యంతో రైళ్లు నడిపించనున్నారు.." అనే వార్త ప్రసారం చేశారు. ఈ వార్త గురించి రాహుల్ కులకర్ణి అనే రిపోర్టర్ లైవ్లో మాట్లాడుతూ వివరించారు. దీంతో మొన్న 14న వందల సంఖ్యలో పేదలు ముంబై బాంద్రా రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆంక్షలకు తూట్లు పడ్డాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొని ఇంటికి వెళ్తామనే ఆశతో స్టేషన్ వచ్చిన పేద జనాలను తమ లాఠీలకు పని చెప్పి మరీ చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ గొడవంతా కేవలం ఏబీపీ మాఝ...

బెదిరింపులకు లొంగారు.. మన కొంప ముంచారు..!

Image
అమెరికా బెదిరింపులకు తలొగ్గి మన దేశ పాలకులు మన దగ్గర ఉన్న కరోనా వ్యాప్తి నిరోధక మందు హైడ్రోక్లోరోక్విన్ను ఆ దేశానికి ఎగుమతి చేయడానికి ఒప్పుకోవడంతో ఇప్పుడు అదే మందు కొరత మం దేశానికి వచ్చేలా ఉంది. పైగా మన దేశంలో కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో కేవలం మన కంటే బలమైన దేశం కాబట్టి, అలాంటి దేశానికే తాము చేయూతనిచ్చామని గొప్పలు చెప్పుకునేందుకు మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత ప్రజల ప్రాణాల మీదికి తెచ్చేలా మారింది. అమెరికాకు హైడ్రోక్లోరోక్విన్ ఎగుమతి ఆమోదం పొందిన తరువాత, రాజస్థాన్ ప్రభుత్వం 300 మి.గ్రా హైడ్రోక్లోరోక్విన్ ఔషధ మొత్తం స్టాక్ను తిరిగి ఇవ్వవలసి వచ్చింది.  హైడ్రోక్లోరోక్విన్ యాంటీ మలేరియా డ్రగ్. ఇది కరోనా వైరస్ చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ప్రతిష్టాత్మక వార్తాపత్రిక ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం, రాజస్థాన్ ప్రభుత్వం 25 శాతం హైడ్రోక్లోరోక్విన్ 200 మరియు 400 మి.గ్రా టాబ్లెట్లను తిరిగి పంపించింది.  ఇండియన్ టైమ్స్ లో ప్రచురితమైన వార్తల ప్రకారం రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మొత్త...

గుజరాత్ లో రోడ్డెక్కిన కూలీలు

Image
లాక్డౌన్ మే 3 వరకు పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తరువాత ముంబైలోని బాంద్రా స్టేషన్ వద్ద వేలాది మంది కార్మికులు గుమిగూడిన తరువాత, మంగళవారం గుజరాత్ డైమండ్ సిటీ సూరత్ లో మరోసారి పెద్ద సంఖ్యలో వలసదారులు గుమిగూడారు. . ఈ ప్రజలు సూరత్ లోని వార్చా ప్రాంతంలో తమ ఇంటికి వెళ్లాలని డిమాండ్ చేశారు. కేసు సమాచారం వచ్చిన తరువాత, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రజలను ఒప్పించే పనిలో ఉన్నారు. సూరత్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నందున దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన మధ్య ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాసులను సమీకరించడం చాలా తీవ్రమైన విషయం. దీనికి ముందు సూరత్ లోని డైమండ్ నగరంలో లాక్డౌన్ కారణంగా మగ్గాలు, ఎంబ్రాయిడరీ కర్మాగారాలు మూసివేశారు. ఈ కారణంగా వేలాది మంది చేతివృత్తులవారు ఇక్కడ నిరుద్యోగులుగా మారారు. ఈ కార్మికులు ఇంటికి తిరిగి వెళ్తామని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం రోడ్డుపైకి వచ్చారు. ఈ శిల్పకారుల్లో ఒడిశాకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ------------------------------------------------------------------------- After thousands of workers gathered at th...

హతవిధీ.. ఏమి దుస్థితి దాపురించేరా..!

Image
లాక్ డౌన్ కరోనాను అరికడుతుందో లేదో తెలియదు గానీ పేదవారి సహనాన్ని మాత్రం పరీక్షిస్తోంది. మహమ్మారి బారిన మృత్యువు వస్తుందో లేదో తెలియదు గానీ ఆకలి రూపంలో కచితంగా వచ్చి రెక్కాడితేనే డొక్కాడే బడుగు జీవులను మాత్రం పొట్టనబెట్టుకునేలా ఉంది. ప్రభుత్వాలు తాము లాక్ డౌన్ కారణంగా చేపడుతున్న చర్యలను సమర్థించుకుంటున్నా.. వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. ఇందుకు సాక్ష్యంలా నిలిచే ఓ సంఘటన ప్రేమనగరిగా పిలువబడే 'ఆగ్రాలో మంగళవారం చోటుచేసుకుంది. వాహనంలో తీసుకెళ్తున్న పాలు రోడ్డుపైన ఒలికిపోతే కొన్ని వీధి కుక్కలు ఆ పాలను తాగసాగాయి. ఆ కుక్కలతోపాటు ఓ నడివయసున్న వ్యక్తి కూడా తన ఆకలి తీర్చుకోవడానికి రోడ్డుపాలైన ఆ పాలనే ఆత్రంగా తాగడం కనిపించింది. ఈ దయనీయ దృశ్యం సర్కార్ తీసుకొంటున్న లాక్ డౌన్ చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది! -------------------------------------------------------------------------------- It is testing the tolerance of the poor as they do not know whether the lockdown will prevent the corona. It is not known whether the death of the pestilence, but only in the form of hung...

దయనీయంగా ఓ ప్రాణదాత అంత్యక్రియలు

Image
ఆ డాక్టరు తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి ఉంటాడు. సొంత ఆస్పత్రి ఉంది. పెద్ద కుటుంబం ఉంది. కావల్సినంత ఆస్తి ఉంది కానీ... అయినప్పటికీ ఆయన అనాథ శవంగా మిగిలిపోయారు. కరోనా విపత్తు ఆయన జీవితాన్ని - కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. నిన్ననే కరోనాతో ప్రాణాలు విడిచిన నెల్లూరి వైద్యుడి కథ ఇది. ఆయన స్వతహాగా ఆర్థోపెడిక్ వైద్యుడు. ఆ విభాగంలో సొంతంగా ఆస్పత్రి నడుపుతున్నారు. అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్తితి విషమంగా ఉండటంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు. చికిత్స పొందుతూ చనిపోయారు.దురదృష్టవశాత్తూ ఆయన చనిపోవడానికి ముందే కరోనా వల్ల ఆయన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. అక్కడ వారికి పాజిటివ్ అని తేలడంతో వారు నెల్లూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత డాక్టరు చనిపోగా కేంద్ర నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలి. కరోనా మరణం కావడం - ప్రత్యేక అనుమతులు అవసరం కావడం వల్ల బంధువులు ఎవరూ రాలేదు. సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంట...

ఏకంగా WHO పై 'పెద్దన్న' గరంగరం !

Image
తమ దేశంలో కరోనా తీవ్రంగా కలకలం రేపడంతో ఏం చేసి ప్రజలను కాపాడుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాళ్లను దొంగలని ఆరోపించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థపైనే తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగుతున్నారు.  మంగళవారం వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్లో ట్రంప్ మాట్లాడుతూ చైనాలో కరోనా వ్యాప్తి తీవ్రతను WHO దాచిపెట్టిందని, అందుకే కరోనా ఇంతలా వ్యాప్తి చెందిందని ఆరోపిస్తున్నారు. దీంతో తాము WHOకు ఇచ్చే నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పైగా WHO చర్యలపై 60 నుంచి 90 రోజుల విచారణను కూడా అమెరికా చేపడుతుందని ఆయన ఏవేవో మాట్లాడేశారు. అమెరికా WHOకు 400 నుంచి 500 మిలియన్ల డాలర్లు ఏటా ఇస్తుంటే.. చైనా కేవలం 40 మిలియన్ల డాలర్లు మాత్రమే ఇస్తుందని, అయినా WHO చైనాకే వత్తాసు పలుకుతోందని ట్రంప్అ వాకులు చెవాకులు పేల్చారు. కరోనా ముప్పు గురించి అంతర్జాతీయ సమాజానికి జాగ్రత్తలు సూచించడంలో WHO విఫలమైందని ఆరోపించా...

నిజాముద్దీన్ ఘటనపై పుకార్లు రేపిన దుండగుడి అరెస్ట్

Image
కరోనా వ్యాప్తిపై తప్పుడు పుకార్లు పుట్టించడమే కాకుండా, అందుకు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లిన తబ్లీఘీ జమాత్ సభ్యులు కారణమని సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టి విద్వేషాలకు కారణమైన దుండగుడిని హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీక్ భరద్వాజ్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేశాడని పోలీసులు తెలిపారు. క్వారంటైన్లో భాగంగా ఆసుపత్రిలో ఉంచిన ఇద్దరు జమాత్ కు చెందిన కరోనా అనుమానితులు పారిపోయారని ఇతను తన పోస్టులో పేర్కొనడంతో, ఈ పుకారు జిల్లా మొత్తం వ్యాపించి  ప్రకంపనలు ముస్లిమా పట్ల విద్వేషాలకు కారణమయ్యాయి. ఈ విషయమై విచారణ చేపట్టిన యమునానగర్ పోలీసులు ఈ పుకార్లకు కారకుడైన ప్రతీక్ భరద్వాజ్ ను అదుపులోకి తీసుకొని  తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, యమునానగర్ నుంచి ఢిల్లీ వెళ్లిన మొత్తం 14 మంది కరోనా నివేదిక కూడా ప్రతికూలంగా రావడం గమనార్హం! -------------------------------------------------------------------------------------...

150 మందితో కూడిన 'మర్కజ్' లిస్టులో 108 మంది ముస్లిమేతరులే..!

Image
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన 159 మంది జాబితాలో 108 మంది ముస్లిమేతరులు ఉన్నరని బిబిసి మీడియా తెలిపింది. వారితో మాట్లాడగా వీరిలో చాలా మంది తమకు తబ్లిఘి జమాత్‌తో లేదా ఇస్లాం మతంతో సంబంధం లేదని చెప్పారని  పేర్కొంది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్‌దేవ్ కూడా ఇదే విషయాన్ని ద్రువీకరించేలా కేంద్రం నుంచి ముందు 158 మంది జాబితా వచ్చింది. తరువాత 194 మంది జాబితా ఉంది. ఇందులో నిజాముద్దీన్ చుట్టూ ఉన్న టవర్ నుండి లాక్ చేయబడిన పేర్లు ఉన్నాయి. కానీ వీరికి తబ్లిఘి సమూహంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ----------------------------------------------------------------------------- Of the 159 returned from Nizamuddin Markaz in Delhi, 108 are non-Muslims, according to BBC media. While talking to them, many of them said that they had nothing to do with Tablighi Jamaat or Islam. The state's health minister TS Singhdev also received 158 listings from the Center to confirm the same. Next is a list of 194 people. This includes names locked from the tower a...