Posts

Showing posts from May 10, 2020

భారత్‌కు అప్పీలును తిరస్కరించిన బ్రిటన్

Image
భారతదేశం పరారీలో ఉన్నట్లు ప్రకటించిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్‌లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మోసం, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేతకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై భారతదేశానికి తనను అప్పగించవద్దని కోరుతూ అప్పీలు చేయటానికి సమర్పించిన దరఖాస్తును బ్రిటన్ సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. మాల్యాను భారతదేశానికి అప్పగించాలంటూ వెస్ట్‌ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి ఆమోదించారు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆయన అప్పీలును కొట్టివేస్తూ ఏప్రిల్ 20వ తేదీన తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీలు చేయటానికి విజయ్ మాల్యా దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్పీలుకు సంబంధించి భారత ప్రభుత్వ స్పందనను ఈ వారం ఆరంభంలో కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఆయన దరఖాస్తును తిరస్కరించింది. దీంతో బ్రిటన్‌లో మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు భారత్‌కు అప్పగించే నిర్ణయం తిరిగి హోంమంత్రి ప్రీతి పటేల్ ముందుకు వెళ్తుంది. సుప్రీం ఆదేశాలు వెలు...

రోగి కోసం ఓ ముస్లిం డాక్టర్ తెగింపు!

Image
డేంజ‌ర్ సిట్యువేష‌న్ లో ఉన్న కరోనా రోగిని రక్షించే క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ సీనియర్ డాక్ట‌ర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. రోగిని కాపాడే క్రమంలో తన పీపీఈ కిట్టును తొలగించారు. దీంతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ డాక్ట‌ర్ పేరు జహీద్‌ అబ్దుల్‌ మజీద్‌. జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆయన నివ‌శిస్తున్నారు. క‌రోనా సోకిన‌ రోగి అంబులెన్స్‌లో ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌లోని ఐసీయూకు తీసుకెళ్లే బాధ్యతను ఆయనకు అప్పగించారు. అయితే స‌దరు రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ప‌డటాన్ని గుర్తించిన మ‌జీద్. అందుకు కార‌ణం శ్వాస కోసం రోగి గొంతులోకి వేసిన గొట్టం పొరపాటున ఊడిపోయినట్లు ఆయన గమనించారు. దాన్ని తిరిగి కావాల్సిన ప్లేసులో పెట్టేందుకు ఈ డాక్ట‌ర్ ప్రయత్నించారు. అయితే అంబులెన్స్‌ లోపల వెలుతురు సరిగ్గా లేదు. అందునా పీపీఈ కిట్టు, క‌ళ్ల‌జోడు ధ‌రించ‌డం వ‌ల్ల లోప‌ల ఏమి స‌రిగ్గా క‌నిపించ‌డం లేదు. ఆల‌స్యం చేస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉన్నందువల్ల అతడిని రక్షించడానికి కళ్లద్దాలు, ముఖ కవచాన్ని తొలగించి, అతడికి ...

లాగుడు బండి.. నిండు గర్భిణి.. మండు వేసవి.. 700 కి.మీ. ప్రయాణం..

Image
ఎంత కష్టం ఎంత కష్టం. వలస వచ్చిన వలస కూలీకి ఎంత కష్టం అని యుగకవి శ్రీ శ్రీ అన్న మాటలు ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీల జీవితాలు కళ్లకు కడుతున్నాయి.కన్నీరు తెప్పిస్తున్నాయి. అటువంటి మరో దీనగాదే ఈ వలస కూలీ కుటుంబానిది. కడుపు చేతపట్టుకుని రెక్కల్ని నమ్ముకుని ఉన్నఊరు వదిలి పొరుగు రాష్ట్రాలు వలస వచ్చిన కూలీలకు లాక్‌డౌన్‌ మోయలేని భారాన్నే కాదు బ్రతటం కూడా కష్టమనిపించేలా చేస్తోంది. ఇంటికి ఏ కష్టం వచ్చినా అది మహిళలపైనే పడుతుంది. అందునా గర్భంతో ఉన్న ఈ మహిళా వలస కూలీ పరిస్థితి మరింత నరగప్రాయంగా మారింది. అసలే కూలి బతుకులు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. అటువంటిది లాక్ డౌన్ తో వలస వచ్చిన ప్రాంతాలను వదిలి ఉన్నఊరికి పయనమన ప్రయాణంలో వందల కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. నెత్తిన సంచి..చంకలో బిడ్డ, భుజాన మరో సంచి వేసుకుని నిండు గర్భంతో భర్తతో కాలి నడకన ఎర్రటి ఎండలో 700 కిలోమీటర్ల నడక ప్రారంభించింది ఆ గర్భిణి దీనగాథ. మధ్యప్రదేశ్‌కు చెందిన రాము భార్య, కూతురితో హైదరాబాద్‌కు వలసొచ్చాడు. లాక్‌డౌన్‌ తో పనులే లేవు. ఉపాధి కరువైంది. వచ్చిన ఊరు భారమైంది. కన్నఊరు పోదామనుకున్నారు, రాము భా...

భారత్ బాట పట్టిన 'యాపిల్'

Image
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాకు అతిపెద్ద షాక్ తగిలింది. చైనా నుంచే ఈ ఉపద్రవం రావడం.. కంపెనీలన్నీ లాక్ డౌన్ తో కుదేలు కావడంతో ఇక ఆ దేశం నుంచి తరలిపోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు చైనాలో బిచాణా ఎత్తివేసి బయటకొస్తున్నాయి. వివిధ దేశాలు వాటిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత్ కూడా ఏకంగా 1000కిపైగా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. తాజాగా భారత్.. చైనాలో నెలకొల్పి అక్కడి నుంచి బయటకు వస్తున్న 300 కంపెనీలను భారత్ కు రావడానికి ఒప్పించింది. ఇక్కడ ఉత్పత్తి యూనిట్లను పెట్టడానికి ఓకే అన్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ ‘యాపిల్’ చైనా నుంచి ఉత్పత్తి యూనిట్ ను మార్చాలని యోచిస్తోంది. భారత ప్రభుత్వం సరైన ప్రోత్సాహకాలు స్థలం ఇస్తే ఏకంగా 40 బిలియన్ డాలర్లు లేదా రూ.3 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుందట. భారత్ కూడా ఈ భారీకంపెనీని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. చైనా నుంచి 5వ వంతు భాగాన్ని భారత్ కు తరలించేందుకు ఆపిల్ కంపెనీ సిద్ధమవుతోంది. ఇండియాలో దాదాపు 4వేల కోట్ల డాలర్ల...

అమెరికాలో ఆ ప్రదేశాల నుంచే రోగ వ్యాప్తి!

Image
అగ్రరాజ్యం అమెరికాను కరోనా కలవరపాటుకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దేశ పరిపాలనకు కేరాఫ్ అడ్రస్ అయిన వైట్ హౌస్ నుంచి మొదలుకొని వివిధ రాష్ట్రాల వరకూ… ప్రాంతాలతో సంబంధం లేకుండా కరోనా వ్యాప్తి జరుగుతోంది. మరోవైపు అమెరికన్లు లాక్ డౌన్ ఎత్తివేయాలని నినదిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ మేరకు విజయం సాధించారు కూడా. అయితే అలాంటి చోట్ల షాక్ కు గురయ్యే వార్తలు తెరమీదకు వస్తున్నాయి.అంతర్జాతీయ వార్త సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణ ప్రకారం – లాక్ డౌన్ నిబంధనలు ఎత్తి వేయించబడిన పలు రాష్ట్రాల్లో కరోనా విస్తృతి పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని వ్యాధిగ్రస్తుల నుంచి ఉద్యోగులకు ఈ మహమ్మారి సోకుతోందని స్పష్టమైంది. ఇక షాకింగ్ విషయం ఏంటంటే…అమెరికన్లు అమితంగా ఇష్టపడే మాంసం ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతోందట. మాంసం ప్యాకింగ్ – ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద నుంచి కరోనా విస్తృతి కొనసాగుతోందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఇటీవల నమోదైన కేసులు దీనికి ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 5వ తేదీ వరకు అమెరికాలోని మాంసం...

మహమ్మారి చేసిన మేలు !

Image
కరోనా లాక్ డౌన్ పుణ్యమానీ భారత్‌లో గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనట్లుగా తొలిసారి కర్బన ఉద్గారాలు పూర్తిగా తగ్గాయి. అయితే, దీనికి కేవలం లాక్‌డౌన్ ఒక్కటే కారణం కాదు. కరోనావైరస్ వల్ల అమలు చేస్తున్న లాక్‌డౌన్ కంటే ముందే శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెరగడం, విద్యుత్ వినియోగంలో తగ్గుదల దీనికి కారణాలని ‘కార్బన్ బ్రీఫ్’ పర్యావరణ వెబ్‌సైట్ అధ్యయనం వెల్లడించింది. మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు మొదలుకావడంతో 37 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న కర్బన ఉద్గారాలు తొలిసారి తగ్గాయి. భారత్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 15 శాతం తగ్గగా ఏప్రిల్‌లో అది 30 శాతానికి తగ్గుంటుందని ఆ అధ్యయనం అంచనా వేసింది. ఇండియన్ నేషనల్ గ్రిడ్ గణాంకాల ప్రకారం బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలు మార్చిలో 15 శాతం తక్కువగా పనిచేశాయి. ఏప్రిల్ తొలి మూడు వారాల్లో 31 శాతం తగ్గింది. అయితే, లాక్‌డౌన్‌కు ముందు కూడా భారత్‌లో బొగ్గుకు డిమాండ్ తగ్గింది. 2018-19తో పోల్చితే 2019-2020లో బొగ్గు డిమాండ్ 2 శాతం తగ్గింది. ఇంతకుముందు దశాబ్దంతో పోల్చినప్పుడు 2010-2020 మధ్య థర్మల్ పవర్ 7.5 శాతం పెరిగింది. అలాంటి తరుణంలో ...

వల వేస్తే.. 'పైసలు' చిక్కాయి..!

Image
ఫేట్ ఎప్పుడు ఎవ‌రికి ఎలా ఉంటుందో చెప్ప‌లేం. ఇప్పుడు చెప్ప‌బోయే సంఘ‌ట‌న మిమ్మ‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. చేపల కోసం చెరువులో వల వేస్తే.. ఏకంగా క‌రెన్సీ నోట్ల కట్ట దొరికింది. అన్నీ రూ. 500,రూ. 2000 నోట్లు ఉండటం చూసి అత‌డు ఆశ్చర్యపోయాడు. పంట పండింది అనుకుని వాటిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇది ఆ నోటా..ఈ నోటా పాకి స్థానికులకు తెలియడంతో పెద్ద సంఖ్య‌లో ఆ చెరువు వ‌ద్ద‌కు వ‌చ్చి గాలించారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు చేపల వేట‌కు వెళ్లాడు. ఎప్ప‌ట్లానే వ‌ల వేశాడు. అయితే ఎవ‌రు.. ఎప్పుడు..ఎందుకు వేశారో తెలియ‌దు కానీ అందులోనుంచి నోట్ల కట్ట బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాటిని బయటకు తీయగానే..గాలి బ‌లంగా వీయ‌డంతో నోట్ల‌న్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మెల్లగా వాటిని ఏరుకొని ఇంటికి వెళ్లాడు. విష‌యం తెలియడంతో… పోలీసులు వచ్చి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎందుకు అలా నీళ్లలో విసిరి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న‌ సంచలనం సృష్టించింది. ------------------------------------------------...

వెయ్యి అప్పు తీసుకున్నందుకు పదేళ్లుగా వెట్టిచాకిరి

Image
ఈ ఫోటోలో నిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దుని పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం..! పదేళ్ళ కింద నటరాజన్ అనే వ్యక్తి దగ్గర కాశీ వేయి రూపాయలు అప్పు చేశాడు. అది తీర్చడం కోసం ఆ నటరాజ్ తన బందువుల కట్టెల కోత కంపనీలో పనికి చేర్చాడు. అప్పటి నుండి కాశీ ఎలాంటి జీతం లేకుండా పని చేస్తూనే ఉన్నాడు..ఆయన తీసుకున్న వేయి రూపాయలు వడ్డీల వ‌డ్డీలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పు మాత్రం తీరలేదు. తనను వదిలేయమని ఎన్నో సార్లు యజమానుల కాళ్ళా వేళ్ళా పడ్డా వాళ్ళు కనికరించలేదు. ఇది ఒక్క కాశీ కథే కాదు. ఇట్లా రెండు చోట్ల కట్టెల మిల్లులలో 42 మంది వెట్టి కార్మికులు పని చేస్తున్నారు. అందులో 16 మంది చిన్న పిల్లలు. కొద్దిగా అప్పు ఇచ్చి చక్రవడ్డీలు..భూ చక్ర వడ్డీలతో వాళ్ళను సంకేళ్ళలో బంధించారు యజమానులు. వాళ్ళ పిల్లలను బడికి పంపనివ్వరు. సరైన తిండి ఉండదు. కట్టుకునేందుకు సరైన బట్ట ఉండదు. దుర్బరమైన జీవితాలు వాళ్ళవి. వాళ్ళ శ్రమతో ...

పరేషానీలో పాత్రికేయం!

Image
ఇన్నాళ్లు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే అందరికీ హడల్. ఇవి రాజకీయాలను శాసించేవి.. వ్యవస్థను ప్రభావితం చేసేవి.. సీఎంలను కూడా గుప్పిట పట్టేవి. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడవన్నీ కుదలేయ్యాయి. ప్రకటనలు లేక నష్టాల పాలయ్యాయి. కోలుకునే పరిస్థితులు కనుచూపుమేరలో కనిపించడం లేదు. పత్రికల వద్ద ప్రింటింగ్ పేపర్ సామగ్రి నిండుకున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేయకపోతే మొత్తం మూతపడుతుంది. ఇక ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు లేక అవి జీతాలు కట్ చేసి చాలా మందిని తీసేశాయి. ఇప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో చాలా మంది జర్నలిస్టులను తీసివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. మరికొందరు ఆ ఊబిలోంచి స్వచ్ఛందంగా బయటకొచ్చేశారు. ఇప్పుడు వారంతా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? అని ఆలోచిస్తే డిజిటల్ మీడియా ఒక అవకాశంగా కనిపిస్తోంది. కానీ అది అంత ఈజీ అయిన వ్యవహారం కాదు.. పత్రికలు న్యూస్ చానెల్స్ లో రిపోర్టర్లు పంపించే వార్తలను ఎడిట్ చేసి పెట్టడం ఈజీ. కానీ డిజిటల్ మీడియాలో పాఠకుడిని చివరి దాకా చదివించేలా రాయడం కత్తిమీద సాము. పైగా అసలు విషయాన్ని పత్రికలు చానెల్స్ లో మొదట చెబుతారు. డిజిటల్ మీడియాలో చివరలో చెప్పాలి. చాలా క్రియేటివిటీగా ...

కోలుకున్న తర్వాత కరోనా మళ్లీ వస్తుందా?

Image
కోవిడ్-19 నుంచి కోలుకున్న కొందరు రోగులకు కరోనావైరస్ పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. కానీ, తర్వాత మళ్లీ పాజిటివ్ అని తేలింది. సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకే, ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కోవిడ్-19 మాత్రం తొందరగా మళ్లీ తిరగబడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. కారణం ఏంటి? జపాన్‌లో ఓ 70 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. ఆయనకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో ఫిబ్రవరిలో టోక్యో ఆసుపత్రిలో ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. చికిత్స అందించారు. జపాన్ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రకారం, ఆయన కోలుకుని మామూలు స్థితికి వచ్చారు. ప్రభుత్వ బస్సులు, రైళ్లలోనూ ప్రయాణించారు. కానీ, కొన్ని రోజుల తరువాత ఆయన మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు. జ్వరం వచ్చిందంటూ ఆయన ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షలు చేస్తే షాకింగ్ విషయం బయటపడింది. ఆయనకు మళ్లీ కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. జపాన్‌లో అలాంటి కేసులు ఇంకా చాలానే నమోదయ్యాయి. కరోనావైరస్ నుంచి కోలుకున్నవారిలో...

ఆ అలవాటు మానేయాల్సి వస్తుందేమో!

Image
వేలాది ఏళ్లుగా వస్తున్న ఆత్మీయ స్పర్శను, ఒకరినొకరు తాకడాన్ని ఇప్పటికిప్పుడు మర్చిపోయేందుకు యావత్ ప్రపంచం తీవ్ర సంఘర్షణ పడుతోంది. కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని కబళించిన తర్వాత వదులుకోవాల్సిన అలవాట్లలో కరచాలనం ఒకటి కావచ్చు. అప్పుడే కలిసిన కొత్త ముఖాలు పరస్పరం పలకరించుకోవడం దగ్గర నుంచి ఇక మళ్లీ జీవితంలో ఇంకెప్పుడూ కలిసే అవకాశం లేని చిరకాల మిత్రులు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకోవడం వరకు, చిన్న చిన్న వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే సాధారణ వర్తకుల నుంచి వందల కోట్ల డాలర్ల ఒప్పందాలు చేసుకునే బిజినెస్ టైకూన్ల వరకు ఈ ప్రపంచంలో అందర్నీ కలిపే బలీయమైన శక్తి షేక్ హ్యాండ్. కరచాలనం కథలు ఈ కరచాలనం పుట్టుకకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో పురాతన గ్రీకుల కాలం నుంచి ఈ హ్యాండ్ షేక్ ఉందన్నది ఒకటి. అప్పట్లో శాంతికి చిహ్నంగా దీనిని భావించే వారు. ఇద్దరు వ్యక్తులు తమ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవని ఒకరికొకరు స్పష్టం చేసుకునేందుకు గుర్తుగా పరస్పరం కరచాలనం చేసుకునేవారు. మధ్యయుగ కాలంలో ఇది యూరోప్‌లో ప్రారంభమై ఉండవచ్చంటూ మరో కథనం కూడా ఉంది. ఆనాటి రాజులు పరస్పరం చేతులు కలుపుకొని బలంగా ఊపడం ద్వారా...

‘స్నేహపూర్వక కాల్పుల్లో’ 19 మంది నావికుల హతం!

Image
ఇరాన్‌ నౌకాదళానికి చెందిన రెండు నౌకల మధ్య ‘స్నేహపూర్వక కాల్పుల్లో’ 19 మంది నావికులు చనిపోయారని, మరో 15 మంది గాయపడ్డారని నౌకాదళం తెలిపింది. ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో జమారాన్ నౌక నుంచి కొత్త నౌకావిధ్వంసక క్షిపణిని పరీక్షిస్తుండగా.. అది కొనరాక్ నౌకను తాకిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్పింది. హోర్ముజ్ జలసంధిలో శిక్షణా విన్యాసాలు చేస్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఇరాన్ సాయుధ బలగాలు తరచుగా విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. ఇరాన్ దక్షిణ తీరంలో ‘‘బందారే జాస్క్ జలాల్లో సైనిక విన్యాసాల సందర్భంగా నిన్న మధ్యాహ్నం కోనరాక్ నౌకను ఒక క్షిపణి ఢీకొట్టింది’’ అని ప్రభుత్వ టీవీ వెబ్‌సైట్‌లో వివరించింది. ‘‘ప్రయోగం కోసం టార్గెట్‌ను తీసుకెళ్లిన ఆ నౌక.. ఆ టార్గెట్ నుంచి తగినంత దూరం రాకపోవటంతో క్షిపణి ఆ నౌకను తాకింది’’ అని పేర్కొంది. టెహ్రాన్‌కు సుమారు 1,270 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో గల జాస్క్ రేవు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. జమరాన్, కొనరాక్ నౌకలు.. ఇరాన్ నౌకా దళానికి చెందినవని చెప్తున్నారు. -------------------------------------------------------- At least 19 sail...

కరోనా పోరులో చైనా కుబేరుడి అద్వితీయ సహకారం

Image
చైనాలో అత్యంత ధనవంతుడైన అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు ‘జాక్ మా’ గత నెలలో తన ట్విటర్ అకౌంట్ ప్రారంభించారు. అంటే, సరిగ్గా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే. ఆయన అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి పెట్టిన ప్రతి పోస్టులోనూ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు తాను అందిస్తున్న వైద్య పరికరాల సాయం గురించే ప్రస్తావిస్తూ వస్తున్నారు.  “వన్ వరల్డ్-వన్ ఫైట్” ఇది ఆయన పోస్ట్ చేసిన మొదటి మేసెజ్‌లలో ఒకటి. “కలిసికట్టుగా మనం సాధించగలం.” ఇది ఆయన ఉత్సాహంగా పెట్టిన మరో మెసేజ్. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు సుమారు 150కి పైగా దేశాలకు వైద్య పరికారాలను అందించే సహాయ కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. ప్రపంచమంతా వైద్య పరికరాల కరవుతో అల్లాడిపోతుంటే ఆయన లక్షలాది మాస్కులు, వెంటిలేటర్లు, ఇతర సహాయ సామాగ్రిని అవసరమైన దేశాలకు పంపుతున్నారు. అయితే, దీని వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటన్నది ఆయన విమర్శకులు కానీ ఆయన మద్దతుదారులు కానీ చెప్పలేకపోతున్నారు. తన సేవా కార్యక్రమాల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకోవాలనుకుంటున్నారా? లేదా పార్టీ తన...

మీకు ప్లాన్ - ఏ & బీ గురించి తెలుసా..?

Image
వాస్తవాలు ఎప్పుడు చెప్పినా ఎటకారంగానే వినిపిస్తుంది. మాయదారి రోగానికి చెక్ పెట్టటం మంచిదే. కానీ.. రానున్న రోజుల్లో దాంతో సహజీవనం చేయాలన్న మాటకు పీకిన ఈకలు ఎన్నో చెప్పాల్సిన అవసరమే లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి వచ్చిన ఈ మాటపై పెద్ద ఎత్తున కామెడీ చేయటం తెలిసిందే. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న దానికి తగ్గట్లే.. జగన్ నోటి నుంచి వచ్చిన మాట ఈ రోజు పలు రంగాలకు చెందిన ప్రముఖులే కాదు.. పలువురు ముఖ్యమంత్రులు ఆయన మాటనే చెబుతున్నారు. వ్యాక్సిన్ తో చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. మాటల్లో చెప్పినంత ఈజీ కావటం టీకా కనుగొనటమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన కనుగొనేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దగ్గర దగ్గర వందకు పైగా కంపెనీ వ్యాక్సిన్ రేసులో ఉన్నాయి. వీటిల్లో ఏ కంపెనీ సక్సెస్ అవుతుందన్నది కాలమే డిసైడ్ చేయాలి. ప్రపంచ ప్రజలెంతో ఆశగా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ ను కనుగొనలేకున్నా.. ఎలా బతకాలన్న దానికి సంబంధించి ప్లాన్ బీ సిద్దం చేయాలన్న మాట వినిపిస్తోంది. మాయదారి రోగానికి మందుగా వ్యాక్సిన్ అన్నది ప్లాన్ ఏ అయితే.. ఈ ప్లాన్ బీ ఏమిటన్న విషయంలోకి వెళి...

పతనం దిశగా మీడియా పయనం!

Image
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని పాటలు పాడేవారు ఎందరో.. కానీ ఎన్నో వ్యవస్థలు పతనమయ్యాయి. కానీ పతనం కానిది.. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని శాసించింది ‘మీడియా’. నాటి ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు హయాం వరకూ తెలుగునేలపై మీడియా శాసించింది.. ప్రజలను ప్రభావితం చేసింది.. కొందరినీ ఓడించింది. కానీ ఒక్క ‘కరోనా’దెబ్బకు ఇప్పుడు కుదేలైంది. ఎందుకీ పతనం.. ఏందాక ఈ పయనం.. లుగు మీడియా కరోనా దెబ్బకు కుదేలైంది. జాతీయ మీడియా కూడా పతనమైనా అక్కడ ఇంతగా లేదు. కరోనాతో తీవ్రమైన సంక్షోభంలోకి మన మీడియా కూరుకుపోయింది. కరోనాతో ఈ సంక్షోభం వచ్చిందా లేదా.. కరోనాను అడ్డం పెట్టుకొని ఉద్యోగులను సాగనంపే ప్రక్రియకు మీడియా యాజమాన్యాలు తెరతీశాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా సంక్షోభాన్ని బూచీగా చూపి ఇబ్బడిముబ్బడిగా ఉన్న జర్నలిస్టును తగ్గించుకునే ఎత్తుగడా? అన్నది అర్థం కాకుండా ఉంది. తెలుగు మీడియాలో అసలేం జరుగుతోంది. దమ్మున్న పత్రికలో జీతాల కోత.. తొలగింపులు తెలుగులోనే దమ్మున్న పత్రికగా తనకు తాను ట్యాగ్ లైన్ వేసుకున్న పత్రిక లాక్ డౌన్ కరోనాతో సర్దేసుకుంది. 50శాతం ఉద్యోగులను హోల్డ్ పేరిట ఇంట్లో కూర్చుండబెట...