Posts

మరోసారి విషంగక్కిన "ఏబీపీ న్యూస్ ఛానల్"

Image
దేశంలో కరోనా వ్యాప్తికి కేవలం ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లీఘీ జమాత్ మర్కజ్ మాత్రమే కారణమనుకేలా విషం చిమ్మే వార్తలను ప్రసారం చేసి ప్రత్యక్షంగానే విద్వేషాలను రెచ్చగొట్టిన "ఏబీపీ న్యూస్ ఛానల్" నిన్న సోమవారం కూడా మరో అసత్యపు కరోనా వార్తను ప్రసారం చేసి మరోసారి ముస్లింలపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ఛానల్ నిన్న మహారాష్ట్రలోని కాన్పూర్ నగరంలోని ఓ మదర్సాలో చదువుతున్న 53 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలిందని ఓ అబద్దపు వార్తను వండివార్చింది. వాస్తవమేమిటంటే, దీని గురించి కనీసం సదరు మదర్సా నిర్వాహకులకు కూడా తెలియదు. "ఏబీపీ న్యూస్ ఛానల్" చుసిన తర్వాతే తమకు తెలిసిందని నిర్వాహకులు తెలుపడం గమనార్హం! అయినా ఎందుకైనా మంచిదని ఈ విషయం తెలుసుకున్న కాన్పూర్ నగర వైద్యాధికారి మదర్సాకు చేరుకొని విచారణ జరుపగా, "ఏబీపీ న్యూస్ ఛానల్" వార్త అసత్యమని తేలింది. సదరు అధికారే "ఏబీపీ న్యూస్ ఛానల్" ప్రసారం చేసిన మదర్సాలో కరోనా పాజిటివ్ వార్త అబద్దమని, ఇటువంటి వార్తల ప్రసారం ఆ ఛానెల్కు తగదని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన ...

ఆర్మీ కమాండోకు ఘోర అవమానం..

Image
కర్ణాటక రాష్ట్రంలోని బెల్గామ్ జిల్లా, చిక్కోడి తాలూకా, యాక్సమ్బా గ్రామంలో ఏకంగా ఓ ఆర్మీ కమాండోనే అత్యంత అమానవీయంగా అవమానించి అక్కడి పోలీసులు కావాల్సినంత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాక్సమ్బా గ్రామానికి చెందిన సచిన్ సునీల్ సావంత్ అనే యువకుడు ఆర్మీలో కోబ్రా దళ కమాండోగా దేశ సేవ చేస్తూ, సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి కరోనా లాక్ డౌన్ కారణంగా గ్రామంలోనే చిక్కుకుపోయాడు. ఇతడు  మొన్న ఆదివారం తన ఇంటి ముందు బైక్ కడుగుతుండగా, స్థానిక పోలీసులు గస్తీ తిరుగుతూ జవాన్ ఇంటికి కూడా వచ్చారు. ఆ సమయంలో తన బండి కడుగుతున్న సదరు జవాన్ను పోలీసులు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించగా, తాను ఇంటి ముందే కడుగుతున్నాను కదా అని చెప్పడమే కాకుండా, తాను అర్మీలో పని చేస్తానని కూడా చెప్పాడు. కానీ, పోలీసులు ఇవేవీ పట్టించుకోకుండా ఆ జవానుకు బేడీలు వేసి, కనీసం చెప్పులు కూడా లేకుండా నిక్కరుపై ఊరంతా తిప్పుతూ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కూడా ఓ కరడుగట్టిన నేరస్తుడికి వేసినట్లు చేతులూ కాళ్లకు కలిపి బేడీలు వేసి ఖైదీలను వేసే సెల్లుకు కట్టేశారు. జవానుకు జరిగిన ఈ అవమానం గురించిన వార్త, ఫోటోలు ఇ...

అవమానించబడ్డవారే ఆపద్బాంధవులవుతున్నారు..

Image
"తబ్లీఘీ జమాత్".. అనే ముస్లింలలో ఓ వర్గం యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకోవడమే కాకుండా, మిగతా ముస్లిం వర్గాలను కూడా మానసికంగా ఎదుర్కొనేలా చేసింది. కరోనా వ్యాప్తికి వీళ్లే కారణమని మీడియా మొరగడం, ఇందులోని నిజానిజాలు విచారించకుండా ప్రభుత్వం ప్రెస్ మీట్లు పెట్టి మరీ మీడియాకు వంతపాడటం నిన్నటి వరకు ఓ పద్ధతి ప్రకారంగా ముస్లింలను అవమానించే చర్యలు ఐకమత్యంగా కొనసాగాయి. కానీ, అవమానించబడ్డ ఆ జమాత్ వర్గీయులే ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో అస్త్రంగా ఉపయోగపడనున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారించబడి, క్వారంటైన్ లో ఉండి, తర్వాత నెగెటివ్ రిపోర్టులు చేబూని తమ ఇళ్లకు చేరిన ఆ జమాతీయులే ఇప్పుడు తాము రక్తదానం చేసి మిగతా కరోనా బాధితులకు ఔషధంగా ఉపయోగపడుతున్నారు. వారి రక్తంలోని ప్లాస్మా ద్వారానే డాక్టర్లు ఇప్పుడు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి మహమ్మారికి ఇంతకు మించిన చికిత్స కూడా లేదు మరి! ఇప్పటి వరకు ఢిల్లీలో 200 మందికి పైగా జమాత్ సభ్యులు తమ ప్లాస్మాను దానం చేయగా, తమిళనాడులో వందల సంఖ్యలో తబ్లీఘీయులు ప్లాస్మా దానం కోసం హాస్పిటళ్ల ముందు బారులుదీరుతున్నార...

కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !

Image
74 ఏళ్ల అల్బ మరూరి ఈక్వెడార్ మహిళ. కరోనావైరస్ సోకి ఆస్పత్రిలో చేరారు. ఆమె చేరిన కొద్ది రోజులకు ఆస్పత్రి వర్గాలు మరూరి మరణించారన్న సమాచారాన్ని ఆమె కుటుంబానికి చేరవేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె అస్థికలు ఇవేనంటూ ఓ మూటను కూడా పంపారు. కాగా, మూడు వారాలు కోమాలో ఉన్న మరూరీకి గురవారం నాడు తెలివి వచ్చింది. వెంటనే ఆమె తన సోదరిని పిలవమని వైద్యుల్ని కోరారు. ఈ వార్త వినగానే ఆమె కుటుంబం ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషంలో మునిగిపోయింది. అయితే, వైద్యులు ఎవరి అస్థికల్ని తమకు పంపారన్న విషయం మాత్రం వారికి అర్థం కాలేదు. జరిగిన తప్పునకు ఆస్పత్రి వర్గాలు క్షమాపణ చెప్పాయి. మరూరి ఈక్వెడార్‌లో కోవిడ్-19 సంక్షోభానికి కేంద్ర బిందువైన గ్వయాకీల్ నగరంలో నివసిస్తున్నారు. కరోనావైరస్‌ దెబ్బకు విలవిలలాడుతున్న దేశాల్లో ఈక్వెడార్‌ కూడా ఒకటి. ఇప్పటివరకు అక్కడ 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, సుమారు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షమాపణ చెప్పిన ఆస్పత్రి వర్గాలు స్థానిక పత్రిక ఎల్ కమర్షియో కథనం ప్రకారం తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో మరూరి గత నెలలో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాలు ఆమె మార్చి 27న ...

నిర్బంధంలో పెరిగిన అశ్లీల వీక్షణం !

Image
లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారి సంఖ్య భారీగా పెరిగిందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు Google, Whatsapp, Twitter సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసింది. NCPCR సంస్థ ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ లభ్యత మీద ఒక స్వతంత్ర సర్వేను నిర్వహించింది. అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. Google Play Storeలో లభించే కొన్ని అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకుంటే అభ్యంతరకరమైన పోర్నోగ్రఫీ మెటీరియల్ లభిస్తోందని, చాలామంది వాటిని డౌన్లోడ్ చేసుకొని అలాంటి కంటెంట్ వినియోగిస్తున్నారని ఆ సంస్థ గ్రహించింది. ఇది పరోక్షంగా చట్టవ్యతిరేకమైన కంటెంట్‌ని సులభంగా వినియోగించుకోవడానికి అవకాశం కల్పించటమేనని అభిప్రాయపడింది. మార్చి 24 తర్వాత దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక ఏకంగా 95% ఛైల్డ్ పోర్నోగ్రఫీ వినియోగం పెరిగిందని NCPCR గుర్తించింది. దేశవ్యాప్తంగా అనేక మంది చిన్న పిల్లలు ఇలాంటి కంటెంట్ బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కమిషన్ వివిధ టెక్నాలజీ దిగ్గజాలకు హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రత్యేకమైన వాట...

మహానగరానికి ఇది మొదటి లాక్ డౌన్ కాదు !

Image
కరోనా వ్యాప్తిని అదుపు చేయాలంటే ఉన్న ఏకైక మార్గం మనిషికి మనిషికి మధ్య ఎడం పాటించడం.. అది మామూలు మాటల ద్వారా సాధ్యం కాదనే ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య దృష్ట్యా లాక్ డౌన్ కాలం కూడా పొడిగిస్తూ పోతున్నారు. ప్రాణాలకంటే మరేది ముఖ్యం కాదు కాబట్టి అందరూ లాక్ డౌన్ పాటిస్తున్నారు. కొందరు ఇలాంటి లైఫ్ మళ్లీ ఎప్పుడూ రావొద్దు రా బాబూ అని కోరుకుంటున్నారు. మరికొందరు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని సెర్చ్ చేస్తున్నారు. లేకేం వందేళ్ల క్రితం భయంకరమైన ప్లూ, కలరా లాంటి వ్యాధులు ప్రభలినప్పుడు కూడా లాక్ డౌన్ పాటించారు..ఆ వివరాలు.. ప్రతి వందేళ్లకి ఒకసారి భయంకరమైన వైరస్లు ప్రపంచాన్ని వణికించాయని చదువుకున్నాం కదా.. ఆ వైరస్ల థాటికి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. సరిగ్గా వందేళ్లక్రితం అనగా 1919లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్లూ ప్రభలింది. ఫ్లూతో కొన్నివందల మంది మంచం పట్టారు. కరోనా మాదిరిగానే అది కూడా అంటు వ్యాధి కావడంతో ఎక్కువ మంది జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని పాలకులు నిర్ణయించారు. ఆ నిర్ణయంలో భాగంగా ప్రజల రక్షణ కోసం రెండో నిజాం...

తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం !

Image
బంజేరుపల్లి .. తెలంగాణలో చిన్న పల్లెటూరు . 120 గడపలు ఉంటాయి . సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ ' అస్తమించడు '! పగలంతా వెలుతురు ఇచ్చి , రాత్రయ్యే సరికి సోలార్ ‌ విద్యుత్ ‌ రూపంలో పల్లెలో విహరిస్తూ ఉంటాడు .   ఈ గ్రామంలో మొత్తం 120 ఇళ్లకుగాను 120 ఇళ్లు .. అంటే వంద శాతం ఇళ్ల పైకప్పు మీద సౌర ఫలకాలే కనిపిస్తాయి . నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు . విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి . కానీ ఇప్పుడు ఈ ఊరి రూపమే మారిపోయింది . నాబార్డ్ తోడ్పాటు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ( నాబార్డ్ ) చొరవతో బంజేరుపల్లిలో ప్రతి ఇంటిలోనూ సౌర విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి . విద్యుత్ ‌ పొదుపు చేసే విధానానికి బంజేరుపల్లి ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది . సంపూర్ణ సోలార్ ‌ గ్రామంగా రూపొందించడానికి గ్రామసభలో తీర్మానం చేసి , ఉత్సాహంగా ముందుకు వచ్చారు . గ్రామంలోని 120 ఇళ్ల మీద సౌర ఫలకాలు వెలిశాయి . నాబార్డు , స్థానిక ఏ...