తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం !



బంజేరుపల్లి.. తెలంగాణలో చిన్న పల్లెటూరు. 120 గడపలు ఉంటాయి. సిద్దిపేట జిల్లాలోని గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ 'అస్తమించడు'! పగలంతా వెలుతురు ఇచ్చి, రాత్రయ్యే సరికి సోలార్విద్యుత్రూపంలో పల్లెలో విహరిస్తూ ఉంటాడు.  గ్రామంలో మొత్తం 120 ఇళ్లకుగాను 120 ఇళ్లు.. అంటే వంద శాతం ఇళ్ల పైకప్పు మీద సౌర ఫలకాలే కనిపిస్తాయి. నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఊరి రూపమే మారిపోయింది.
నాబార్డ్ తోడ్పాటు
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్) చొరవతో బంజేరుపల్లిలో ప్రతి ఇంటిలోనూ సౌర విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి. విద్యుత్పొదుపు చేసే విధానానికి బంజేరుపల్లి ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది. సంపూర్ణ సోలార్గ్రామంగా రూపొందించడానికి గ్రామసభలో తీర్మానం చేసి, ఉత్సాహంగా ముందుకు వచ్చారు. గ్రామంలోని 120 ఇళ్ల మీద సౌర ఫలకాలు వెలిశాయి. నాబార్డు, స్థానిక ఏపీజీవీ బ్యాంక్ఇచ్చిన రుణాలతో పనులు జరిగాయి. నేడు గ్రామంలో ప్రతి ఇంటిలోనూ 4 లైట్లు, 4 ఫ్యాన్లు, టీవీ, ఫ్రిజ్‌ (500 వాట్స్‌) సోలార్విద్యుత్తోనే పనిచేస్తున్నాయి.
కరెంట్కోతల నుంచి విముక్తి
గతంలో కరెంటు కోతలతో విసిగిపోయిన గ్రామస్థులకు ఇప్పుడు విద్యుత్ గురించి పెద్దగా టెన్షన్ లేదు. కరెంటు పోయిన మరుక్షణం సౌర విద్యుత్వారికి సేవలు అందిస్తోంది. ఇళ్లలోనే కాదు, 65 సోలార్వీధి దీపాలు ప్రజల జీవితంలో వెలుగులు నింపుతున్నాయి. "వానాకాలంలో పిడుగు ప్రమాదాలు ప్రాంతంలో ఎక్కువ. వీటి నుంచి సోలార్యూనిట్లను కాపాడుకోవడానికి లైట్నింగ్ అరెస్టర్లను కూడా బిగించారు" అని బంజేరుపల్లి ఎంపీటీసీ శాంత చెప్పారు.
ప్రతి ఇంటి నుంచి డిపాజిట్గా రూ.8 వేలు
ఒక్కో ఇంటికి సోలార్ప్యానెళ్లు, బ్యాటరీలు, వైరింగ్ఏర్పాటు చేయడానికి 85 వేల రూపాయలు ఖర్చయింది. ప్రతి ఇంటి నుంచి డిపాజిట్గా రూ.8 వేలు వసూలు చేశారు. మొత్తం వ్యయంలో 40 శాతాన్ని నాబార్డు సబ్సిడీగా అందించింది. "మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇచ్చారు. గ్రామస్థులు ఎవరి వాయిదాను వారు నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించేందుకు అంగీకరించారు" అని సిద్దిపేట జిల్లా నాబార్డ్ అధికారి గంటా రమేష్కుమార్వివరించారు.
మా పల్లె కళ మారింది!
'సోలార్గ్రామం'గా గుర్తింపు పొందిన తర్వాత మా ఊరు మారిపోయింది. వానా కాలంలో కరెంటు కోతలనేవే లేకుండా, అసలు కరెంటు పోయిందనే విషయం కూడా తెలియకుండా చాలా సంతోషంగా ఉంటున్నాం' అని గ్రామ ఉప సర్పంచ్రాజయ్య చెప్పారు. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్రావు ఓసారి బంజేరుపల్లిని సందర్శించారు. సంపూర్ణ సోలార్విద్యుత్వినియోగంలో ఉన్న గ్రామం తన నియోజకవర్గంలో ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు చెల్లించాల్సిన వాయిదాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. "సోలార్ విలేజిగా గుర్తింపు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వందల మంది మా ఊరికి అధ్యయనం కోసం వస్తున్నారు" అని ఉప సర్పంచ్రాజయ్య ఆనందంగా చెప్పారు.
 'బిల్లులు తగ్గాయి'
సోలార్విద్యుత్వ్యవస్థను అమర్చుకున్న తర్వాత తమ జీవనం మరింత మెరుగైందని, బిల్లుల మోత తగ్గిందని బంజేరుపల్లికి చెందిన గృహిణి లలిత తెలిపారు. గతంలో తాము నెలకు రూ.500 విద్యుత్బిల్లు కట్టేవాళ్లమని, సౌర విద్యుత్రాకతో నెలకు రూ.150 మాత్రమే బిల్లు కడుతున్నామని ఆమె చెప్పారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !