"వేదాంత" ఉదారత
ఎట్టకేలకు మన కుబేరులు కూడా కరోనాపై యుద్ధం చేయడానికి తమ వంతు సాయం ప్రకటించి ఉదారతను చాటుకున్నారు. అందరి కంటే ముందు "వేదాంత" గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కరోనా పోరాడేందుకు ప్రభుత్వానికి రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు మంగళవారం మీడియాకు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో తాను ప్రకటించిన ఈ విరాళం రోజువారీ కూలీలకు, ఎలాంటి ఆధారం లేని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్థోమత ఉన్న ఇతర సంపన్న వర్గాల ప్రజలు కూడా తమ చుట్టూ ఉన్న పేదవారికి ఈ కష్ట సమయంలో తమ బాధ్యతగా సాయం అందించాలని అనిల్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment