ముస్లిం సంపన్నుల ఔదార్యం
పవిత్ర భారతావనిలో ఎల్లప్పుడూ తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏరోజుకారోజు కొత్తగా తలెత్తుతున్నా భారత ముస్లింలు మాత్రం దేశానికి అవసరం వచ్చిన ప్రతిసారీ తమ వంతు సాయాన్ని అందరికంటే ముందుగా ప్రకటించి దేశభక్తిని చాటుకుంటూనే ఉన్నారు. ప్రస్తుత కరోనా కాలంలో కూడా అందరి కంటే ముందు మళ్ళీ ముస్లిం కుబేరులే ఔదార్యాన్ని ప్రదర్శించారు. ఒకప్పుడు అంటే అంబానీల కంటే ముందు దేశంలోనే అత్యంత సంపనుల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి "విప్రో" గ్రూప్ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ కరొనపై పోరాటానికి 7.5 బిలియన్ డాలర్ల విరాళం అందజేశారు. ఈ మొత్తం ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే రూ.57195,00,00,000 అన్నమాట! ఇంత భారీ విరాళం దేశానికి ఇవ్వడంతో అజీమ్ ప్రేమ్ జీ పాశ్చాత్య దానకర్ణులుగా కొనియాడబడుతున్న బిల్ గేట్స్, వారెన్ బఫెట్ సరసన చేరారు.
అదేవిధంగా ప్రఖ్యాత మందుల తయారీ కంపెనీ యజమాని వై.కె.హామీద్ కూడా కరోనా వైరస్ కు మందులు తయారీకి జరుగుతున్న ప్రయోగాల కోసం అవసరమయ్యే మెడికల్ కిట్లను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు.

Comments
Post a Comment