కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో చైనా వాళ్లు ఇప్పుడు త మ అల వాట్లు మార్చ కోవ డంపై దృష్టిపెట్టారు . అందులో భాగంగా చైనా దేశంలోని షెన్ జెన్ నగరం మొట్టమొదటిసారి కుక్కలు , పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించింది . మే 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం పిల్లులు , కుక్కలతో పాటు పాములు , బల్లులు , రక్షిత వన్యప్రాణులను తినడాన్ని నిషేధించారు . పాములు , బల్లులు , కుక్కలు , పిల్లులతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం , విక్రయం , వినియోగాన్ని షెన్ జెన్ నగరంలో నిషేధించారు . చైనాలోని వూహాన్ నగరంలో జంతువధశాల కేంద్రంగా కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో షెన్ జెన్ నగరం కుక్కలు , పిల్లుల మాంసం తినడాన్ని నిషేధించింది . తైవాన్ , హాంకాంగ్ దేశాల్లో కూడా కుక్కలు , పిల్లులను తినడాన్ని నిషేధించారు . అయితే ఆవులు , గొర్రెలు , గాడిదలు , కుందేళ్లు , కోళ్లు , బాతులు , పావురాలు , పిట్దలను ఈ నిషేధం నుంచి మినహాయించారు . --------------------------------------------------------------------------------- The...
Comments
Post a Comment